సిటీబ్యూరో, ఆగస్టు 27(నమస్తే తెలంగాణ): క్యాన్సర్ నివారణకు నూతన చికిత్సా విధానం అందుబాటులోకి వచ్చినదని జీన్ పవరెక్స్ సంస్థ ఫౌండర్స్ డాక్టర్ కల్యాణ్, డాక్టర్ హిమ పేర్కొన్నారు. క్యాన్సర్ పేషెంట్లకు మెరుగైన చికిత్స అందించేందుకు జీన్ పవరెక్స్-ఆంకో.కాం (ఆమెరికా)తో శనివారం జూబ్లీహిల్స్లోని జీన్ పవరెక్స్ కార్యాలయంలో ఒప్పందం కుదిర్చుకున్నట్లు తెలిపారు. అనంతరం, డాక్టర్ కళ్యాణ్ మాట్లాడుతూ, చికిత్సలో ఆధునిక జీన్ సీక్వెన్సింగ్ టెక్నాలజీ అందుబాటులో తెచ్చామన్నా రు. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2020 నివేదిక ప్రకారం, దేశం లో ప్రతి 10 మందిలో ఒకరు క్యాన్సర్ బారిన పడుతున్నారని, ప్రతి 15 మందిలో ఒకరు ఈ వ్యాధితో చనిపోతున్నారని చెప్పారు. ప్రస్తుతం క్యాన్సర్ చికిత్సకు ఎఫ్డీఏ ఆమోదించిన 82 రకాల చికిత్స విధానాలు అందుబాటు లో ఉన్నాయన్నారు. రొమ్ము, ప్రొస్టేట్, పెద్ద పేగు, ఊపిరి తిత్తుల క్యాన్సర్తో పాటు మరో 15 రకాల క్యాన్సర్లకు మె రుగైన చికిత్స అందించేందుకు జీన్ పవరెక్స్ కృషి చేస్తున్న ట్లు కళ్యాణ్ పేర్కొన్నారు. జీన్ సీక్వెన్సింగ్ పద్ధతి ద్వారా క్యాన్సర్ మూల కారణాలను గుర్తించి, చికిత్స అందించ డం, జన్యుపరమైన సమస్యలు గుర్తించి చికిత్స అందించ డం ద్వారా సత్ఫలితాలు వస్తున్నాయని పేర్కొన్నారు.