దుండిగల్, ఆగస్టు19: పంక్చర్ అయిన టైర్ను మారుస్తుండగా, వెనుక నుంచి వాహనం ఢీకొని.. లారీ డ్రైవర్, క్లీనర్ చనిపోయారు. ఔటర్పై అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. దుండిగల్ పోలీసుల కథనం ప్రకారం.. ప్రకాశం జిల్లా ముళ్లమూరు మండలం, ఉమామహేశ్వరపురానికి చెందిన పాములపాటి ప్రతాప్ (37), అద్దంకి ఆర్టీసీ డిపోలో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. సెలవుల్లో ఉండటంతో గురువారం ఉదయం లారీని నడిపేందుకు ముందుకొచ్చాడు. ప్రకాశం జిల్లా మార్టురులో గ్రానైట్ లోడ్ వేసుకొని.. కర్ణాటకకు వెళ్తుండగా, దుండిగల్లోని ఎగ్జిట్ నంబర్ 5 దాటగానే లారీ టైర్ పంక్చర్ అయ్యింది. వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపి క్లీనర్ ప్రభుదాస్(33)తో కలిసి టైరు మారుస్తుండగా, గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రతాప్, ప్రభుదాస్లను చికిత్స కోసం వైద్యశాలకు తరలిస్తుండగా, మార్గమధ్యలో మృతి చెందారు.