నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఆగస్టు 14: 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన స్వతంత్ర భారత వజ్రోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. వేడుకల్లో ఏడో రోజైన ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా జానపద కళాకారులు ప్రదర్శనలు నిర్వహించారు. కళాకారుల ప్రదర్శనలు ఆద్యంతం ఆకట్టుకొన్నాయి. సాయంత్రం వేళ బాణసంచా పేల్చి సంబురాలు జరుపుకొన్నారు. ఆయా కార్యక్రమాల్లో శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, మంత్రులు తన్నీరు హరీశ్రావు, ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతిరాథోడ్, సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, వీ శ్రీనివాస్గౌడ్ తదితరులు పాల్గొని, ప్రసంగించారు. స్వతంత్ర సమరయోధుల స్ఫూర్తితో ముందుకుసాగాలని పిలుపునిచ్చారు. అద్భుత ప్రదర్శనలు ఇచ్చిన కళాకారులకు మంత్రులు ప్రశంసాపత్రాలను అందజేశారు.