ఆర్కేపురం, ఆగస్టు 14: స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా టెలిఫోన్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్, టెలిఫోన్ కాలనీ మహిళా మండలి, శ్రీ జ్ఞానసరస్వతి దేవాలయం సంయుక్త ఆధ్వర్యంలో త్రివర్ణ పతాక ర్యాలీ నిర్వహించారు. నేడు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు టెలిఫోన్ కాలనీ అసోసియేషన్ భవనంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు సంజీవరెడ్డి, మల్లేశ్యాదవ్, సత్యనారాయణ, సెక్రటరీ మధుసూదన్, దినేశ్, నర్సింహారావు, సోమశంకర్ తదితరులు పాల్గొన్నారు.
మహనీయుల విగ్రహాలు పాలతో శుద్ధి
స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ఆదివారం టీఆర్ఎస్ పార్టీ బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు రామిడి రాంరెడ్డి ఆధ్వర్యంలో స్వతంత్య్ర సమరయోధులు, మహనీయుల విగ్రహాలను పాలతో శుద్ధిచేసి, పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు పెద్దబావి ఆనంద్రెడ్డి, కార్పొరేటర్లు భీమిడి స్వప్నా జంగారెడ్డి, పెద్దబావి శ్రీనివాస్రెడ్డి, లిక్కీ మమత, కృష్ణారెడ్డి, కో-ఆప్షన్ సభ్యులు గుర్రం ప్రసన్న వెంకటరెడ్డి, పెద్దబావి నాగ నందీశ్వర్రెడ్డి, బండంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ టీఆర్ఎస్ అద్యక్షుడు కర్రె చిత్రం సాయి తదితరులు పాల్గొన్నారు.