పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి, వాటిని సంరక్షించాలని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డి అన్నారు. బుధవారం కంటోన్మెంట్ పరిధిలోని ఓల్డ్ ఎయిర్పోర్టు రోడ్డులో వాకర్స్ అసోసియేషన్తో పాటు స్థానిక నేతలతో కలిసి వన మహోత్సవంలో భాగంగా జక్కుల మహేశ్వర్రెడ్డి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75ఏండ్లు పూర్తయిన సందర్భంగా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ నెల 22వరకు వజ్రోత్సవంను రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కంటోన్మెంట్ పరిధిలో మొక్కలను నాటుతున్నట్లు వివరించారు. మహాత్మాగాంధీ, భగత్ సింగ్ వంటి అనేకమంది మహనీయుల త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్య్రం లభించిందన్నారు.
ఇంటింటా జాతీయ పతాకాన్ని ఎగరేద్దాం
ఇంటింటా జాతీయ పతాకాన్ని ప్రతి ఒక్కరూ ఎగురవేయాలని బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డి పిలుపునిచ్చారు. వార్డు పరిధిలోని సంచారిపురి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్, వాయునగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్, ఉమానగర్ వెల్ఫేర్ అసోసియేషన్, బాబూజీనగర్, ఆకాశ్నగర్ వెల్ఫేర్ అసోసియేషన్లతో కలిసి జెండాలను గడప గడపకు అందించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో రెనాల్డ్ జోసఫ్, శ్రీనివాస్రెడ్డి, హాసీన్ఖాన్, బదురుద్దీన్, నర్సింహ, రవి చ ంద శర్మ, పద్మ, సౌజన్య, శ్రీధర్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఓయూ పీఎస్లో మొక్కలు నాటిన డీసీపీ
స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా వనమహోత్సవ్ కార్యక్రమాన్ని ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఈస్ట్జోన్ డీసీపీ చక్రవర్తి గుమ్మి హాజరై మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో కాచిగూడ ఏసీపీ ఆకుల శ్రీనివాస్, ఓయూ సీఐ రమేశ్నాయక్, ఎస్సైలు, స్థానిక ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పాల్గొని మొక్కలు నాటారు.
అంబేద్కర్నగర్ బస్తీలో..
స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా మోండా డివిజన్ రైల్నిలయం అంబేద్కర్నగర్ బస్తీలో స్థానిక ఎమ్మెల్యే జి. సాయన్న కూతురు, కవాడిగూడ డివిజన్ మాజీ కార్పొరేటర్ లాస్యనందిత ఇంటింటికీ తిరుగుతూ జాతీయ జెండాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు ముప్పిడి మధుకర్, సదానంద్గౌడ్, పింజర్ల మురళి యాదవ్, భాస్కర్ ముదిరాజ్, నారాయణ, రాజయ్య, సంతోష్, నర్సింగ్, రాము తదితరులు పాల్గొన్నారు.
లాలాగూడ పోలీస్ స్టేషన్లో ..
స్వతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న వన మహోత్సవంలో భాగంగా లాలాగూడ పోలీస్ స్టేషన్లో సీఐ మధులత మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని సూచించారు. మొక్కల ఉపయోగాలు, ప్రకృతిని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత గురించి విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో డీఐ వెంకటేశ్వర్లు, ఎస్సైలు రవీందర్, నాగరాజు, శాహిన్ పాషా, స్థానిక రైల్వే మిక్స్డ్ స్కూల్ విద్యార్థులు పాల్గొని మొక్కలు నాటారు.