సిటీబ్యూరో, ఆగస్టు 10 ( నమస్తే తెలంగాణ ) : ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్న స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురసరించుకొని బుధవారం వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా జీహెచ్ఎంసీ వ్యాప్తంగా 75 ఫ్రీడమ్ పారులను ప్రారంభించారు. ఖైరతాబాద్ జోన్ జూబ్లీహిల్స్ రోడ్డు 36లో ఫ్రీడమ్ పారును మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, రాజ్యసభ సభ్యులు కేశవరావు, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, బల్దియా కమిషనర్ లోకేశ్ కుమార్ ప్రారంభించారు. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రజా ప్రతినిధులచే మొకలు నాటే కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టారు. అదేవిధంగా.. ఎల్బీనగర్ సరిల్లో 12, చార్మినార్ జోన్లో 12, ఖైరతాబాద్ జోన్లో 15, శేరిలింగంపల్లి జోన్లో 12, సికింద్రాబాద్ జోన్లో 12 ఫ్రీడమ్ పారులను ఏర్పాటు చేశారు. ఈ పార్కుల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. దేశ భక్తిని పెంపొందించే విధంగా వజ్రోత్సవాల స్ఫూర్తితో 10 పారుల్లో ఉదయం, సాయంత్రం దేశభక్తి గీతాలు ప్లే చేయనున్నారు.
చాచా నెహ్రూ పారు, కేబీఆర్ పారు, కేఎల్ఎన్ యాదవ్ పారు, జేవీఆర్ పారు, కృష్ణకాంత్ పారు, ఏఎస్ఆర్ రావు పారు, ఉప్పల్ అర్బన్ పారు, ఎన్జీవో కాలనీ పారు, ఇందిరా పారు, సుందరయ్య పారుల్లో మ్యూజిక్ సిస్టం ఏర్పాటు చేశారు. ఫ్రీడమ్ పారుల ఏర్పాటులో భాగంగా రోడ్ నంబర్ 12లో సీఎస్ సోమేశ్ కుమార్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ డీఎస్ లోకేశ్ కుమార్ మొకలు నాటారు.