కవాడిగూడ, ఆగస్టు 10 : స్వతంత్ర భారత వజ్రోత్సవాలను సీఎం కేసీఆర్ ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారని ఎమ్మెల్సీ, భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ స్టేట్ చీఫ్ కమిషనర్ కల్వకుంట్ల కవిత అన్నారు. ప్రతి విద్యార్థి, ప్రతి పౌరుడు ఈ వజ్రోత్సవాలలో మొక్కలు నాటి వాటి పరిరక్షణ బాధ్యతలు తీసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. బుధవారం కవాడిగూడ డివిజన్ దోమలగూడలోని భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ హైస్కూల్లో 75వ స్వాతంత్ర భారత, వన మహోత్సవ సంబురాలను ఘనంగా నిర్వహించారు.
అనంతరం ఎమ్మెల్యే ముఠా గోపాల్, నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతశోభన్ రెడ్డి, కార్మిక సంఘం నాయకుడు మోతె శోభన్ రెడ్డి, టీఆర్ఎస్ గ్రేటర్ నాయకుడు ఎంఎన్ శ్రీనివాస్రావు, మాజీ కార్పొరేటర్లు వి.శ్రీనివాస్రెడ్డి, ముఠా పద్మనరేశ్, లాస్యనందితలతో కలిసి ఆమె మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ స్కూల్స్ స్టేట్ సెక్రటరీ వరలక్ష్మి, హెచ్ఎం అనురాధ, స్కౌట్ మాస్టర్ సాయికిరణ్, పరమేశ్వర్, అనంతలక్ష్మీ, టీఆర్ఎస్ నాయకులు నవీన్కుమార్, వల్లాల శ్యామ్ యాదవ్, వై.శ్రీనివాస్, రాకేశ్ కుమార్, కాల్వ గోపి, ముచ్చకుర్తి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.