చాదర్ఘాట్, ఆగస్టు 10 : స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకుని ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం రెపరెపలాడాలని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. బుధవారం ఆజంపురాలో జాతీయ జెండాల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ సమైక్యతను చాటిచెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ అనితా నాయక్, జోనల్ కమిషనర్ అశోక్ సామ్రాట్, ఈస్ట్జోన్ డీసీపీ చక్రవర్తి, మలక్పేట నియోజకవర్గం ఇన్చార్జి ఆజం అలీ, లాయక్ అలీ, సునీత్పత్తి తదితరులు పాల్గొన్నారు.