స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఇంటింటికీ త్రివర్ణ పతాకాలను పంపిణీ చేసింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరిలో దేశభక్తి భావన, పోరాట స్ఫూర్తిని నింపేందుకు ఈ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహిస్తున్నది. ఆగస్టు 22 వరకు పలు కార్యక్రమాల కోసం రూపకల్పన చేసింది. ఇందులో ప్రజలందరినీ భాగస్వాములను చేస్తున్నది. పిల్లలు, యువత, మహిళలు, కవులు, కళాకారులు, క్రీడాకారులు, వృత్తి నిపుణులు.. ఇలా అన్ని వర్గాల వారు పాలుపంచుకునేలా ఏర్పాట్లు చేసింది.
బడంగ్పేట, ఆగస్టు 9: వజ్రోత్సవాల సందర్భంగా ప్రతి ఇంటి మీద జాతీయ జెండాలను ఎగుర వేయాలని మేయర్ దుర్గా దీప్లాల్ చౌహాన్ పేర్కొన్నారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 26,27 డివిజన్ల పరిధిలో పాత తాగునీటి పైపులైన్లను తొలగించి కొత్త పైపులైన్లు వేయడానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ సీహెచ్ నాగేశ్వర్, కార్పొరేటర్లు పెండ్యాల నర్సింహ, భిక్షపతి, కీసర హరినాథ్ రెడ్డి, కాలనీ వాసులు తదితరులు ఉన్నారు.
కందుకూరు, ఆగస్టు 9: మండల పరిషత్ సమావేశపు హాల్లో జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి మంగళవారం సర్పంచ్లు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం ఎంపీపీ మంద జ్యోతి పాండుతో కలిసి జాతీయ జెండాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కప్పాటి పాండురంగారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ దేవరశెట్టి చంద్రశేఖర్, రైతు బంధు అధ్యక్షుడు కృష్ణారాంభూపాల్రెడ్డి, ఎంపీడీవో వెంకట్రాములు, ఎంపీఎచ్వో విజయలక్ష్మి, సర్పంచులు సాద మల్లారెడ్డి, జంగిలి పరంజ్యోతి, శ్రీనివాస్, ఎంపీటీసీ కాకి రాములు, యాదయ్య, మల్లేశ్, టీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం నాయకులు పొలెమోని అశోక్ ముదిరాజ్, తాళ్ల కార్తిక్ బొక్క దీక్షిత్రెడ్డి, వివిధ గ్రామాల పంచాయతీల కార్యదర్శులు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
పహాడీషరీఫ్, ఆగస్టు 9: జల్పల్లి మున్సిపల్ కేంద్రం, శ్రీరామకాలనీలో జాతీయ జెండాలను పంపిణీ కార్యక్రమాన్ని జల్పల్లి మున్సిపాలిటీ చైర్మన్ అబ్దుల్లా సాది, కమిషనర్ సుదర్శన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జల్పల్లి మాజీ సర్పంచ్ కట్టెల రాములు, కౌన్సిలర్లు బుడుమాల యాదగిరి, కెంచె లక్ష్మీనారాయణ, పల్లపు శంకర్, టీఆర్ఎస్ నాయకులు నాగభూషణం, మారుతి, సాధిక్, మున్సిపల్ సిబ్బంది శ్రీనివాస్, శ్రీధర్, శేఖర్, కుమార్, దానయ్య, తదితరులు పాల్గొన్నారు.
ఆర్కేపురం, ఆగస్టు 9: సరూర్నగర్ డివిజన్లో కార్పొరేటర్ ఆకుల శ్రీవాణిఅంజన్ ఆధ్వర్యంలో ఇంటింటికీ జాతీయ జెండాలను పంపిణీ చేశారు.
ఆర్కేపురం డివిజన్లోని హరిపురి కాలనీ, ఆర్కేపురం, చిత్రలేఅవుట్ కాలనీల్లో ఆర్కేపురం డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు పెండ్యాల నాగేశ్ జాతీయ జెండాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఖిల్లా మైసమ్మ ఆలయ చైర్మన్ గొడుగు శ్రీనివాస్ముదిరాజ్, జీహెచ్ఎంసీ అధికారులు విజయ్ కుమార్, శ్రీధర్, శ్యామ్ కుమార్, మాధవి, కీర్తన, మహేశ్, రవి, కాలనీ వాసులు కృష్ణమూర్తి, అనిల్, రమేశ్బాబు, సాయి కుమార్ తదితరులు ఉన్నారు.