గౌతంనగర్, ఆగస్టు 6 : టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే తెలంగాణ అభివృద్ధి జరుగుతున్నదని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. శనివారం గౌతంనగర్ డివిజన్ పరిధి, వాణినగర్లో రూ.29లక్షలతో చేపట్టే సీసీ రోడ్డు పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాజకీయాలకు అతీతంగా మల్కాజిగిరి నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామన్నారు. అర్హులందరికీ ప్రభుత్వ పథకాలను అందజేస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు మేకల సునీతారాముయాదవ్, ప్రేమ్కుమార్, డిప్యూటీ కమిషనర్ రాజు, డీఈ లౌక్య, ఏఈ దివ్యజ్యోతి, మాజీ కార్పొరేటర్ జగదీశ్గౌడ్, టీఆర్ఎస్ నాయకులు మేకల రాముయాదవ్, కాలనీ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
అర్హులందరూ వ్యాక్సిన్ వేసుకోవాలి
మల్కాజిగిరి, ఆగస్టు 6: అర్హులందరూ వ్యాక్సిన్ వేసుకోవాలని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. శనివారం మల్కాజిగిరి డివిజన్, సీతారాంనగర్లోని కరోనా వ్యాక్సినేషన్ సెంటర్లో బూస్టర్ డోస్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ.. 18 సంవత్సరాలకుపైగా ఉన్నవారికి ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తున్నామని.. ఇప్పటికే రెండు డోసులు తీసుకున్నవారు బూస్టర్ డోస్ తీసుకోవాలన్నారు. ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతుండటంతో అందరూ మాస్కులు పెట్టుకోవాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్లు కపూర్, రాధ, మాజీ కార్పొరేటర్ జగదీశ్గౌడ్, అధికార ప్రతినిధి జీఎన్వీ సతీశ్కుమార్, మీడియా ఇన్చార్జి గుండా నిరంజన్, రాముయాదవ్, పిట్ల శ్రీనివాస్, సంతోశ్రాందాస్, మోహన్రెడ్డి, సూరి, వేణుగోపాల్పాల్గొన్నారు.
ఆర్టీసీ బస్ ప్రయాణం సురక్షితం
మల్కాజిగిరి, ఆగస్టు 6: ఆర్టీసీ బస్లో ప్రయాణం సురక్షితమని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. శనివారం ఓల్డ్ నేరేడ్మెట్ నుంచి కృపా కాంప్లెక్స్ వరకు ఆర్టీసీ బస్ లో ఎమ్మెల్యే ప్రయాణించి.. డ్రైవర్, కండక్టర్ను పలకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆర్టీసీ బస్లో ప్రయాణించడం ఆనందంగా ఉందన్నారు. ఒక్కసారిగా ఎమ్మెల్యేను చూసి.. ప్రయాణికులు, కండక్టర్, డ్రైవర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జగదీశ్గౌడ్, అధికార ప్రతినిధి జీఎన్వీ సతీశ్కుమార్, సంతోశ్రాందాస్, పిట్ల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.