ఉప్పల్, ఆగస్టు 6 : ఉప్పల్ నియోజకవర్గం లోని అన్ని కాలనీల సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు చేపడుతామని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. నాచారం ఓల్డ్ విలేజ్లో శనివా రం కార్పొరేటర్ శాంతిసాయిజెన్ శేఖర్తో కలిసి ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీ లో సమస్యలు పరిశీలించి, కాలనీవాసుల నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సమస్యల ప రిష్కారానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. కాలనీలో మురుగునీటి కాలువల సమ స్యలపై దృష్టిసారించాలని తెలిపారు. డ్రైనేజీలు, మంచినీటి పైపులైన్లు నూతనంగా ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనులు పూర్తి చేస్తామన్నారు.
కాలనీల సమగ్రాభివృద్ధికి ప్రణాళికలతో ముందుకుసాగుతున్నామని తెలిపారు. అధికారులు సమన్వయంతో పనిచేస్తూ, కాలనీల్లో సమస్యలు రాకుం డా చూడాలన్నారు. ప్రజల కోసం పనిచేసేవారికి తప్పక గుర్తింపు ఉంటుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం తగిన నిధులు మంజూరు చేస్తుందని, పనుల్లో నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో జలమండలి జీఎం జాన్ షరీఫ్, ప్రాజెక్టు ఆఫీసర్ రమాదేవి, డీఈ రూప, నేతలు జనుంపల్లి వెంకటేశ్వర్రెడ్డి, టీఆర్ఎస్ నాయకు లు సాయిజెన్ శేఖర్, డివిజన్ అధ్యక్షుడు మేకల ముత్యంరెడ్డి, గరిక సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.
సీనియర్ సిటిజన్లకు అండగా ఉంటాం : ఎమ్మెల్యే
అనుభవం నేర్పే పాఠాలే జీవన మనుగడలో కీలకంగా మారుతాయని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. సీనియర్ సిటిజన్ల సలహాలు, సూచనలతో ముందుకు సాగుతామని అన్నారు. నాచారం ఓల్డ్ విలేజ్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయా న్ని శనివారం కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్తో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం ‘హ్యాం డ్ బుక్ ఫర్ ఎల్డర్లి’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనుభవం జీవితంలో ఎంతో ఉపయోగపడుతుందని, ప్రతి ఇంటిలో వయోవృద్ధులు ఉన్నప్పుడే ఆ ఇం టికి సంపూర్ణత చేకూరుతుందన్నారు. వయోవృద్ధుల కోసం భవనం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.
కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు ప్రేమ్కుమార్, ప్రధాన కార్యదర్శి సాయిబాబా, డైరెక్టర్స్ పాండురంగం, రాంచంద్రమూర్తి, ఉపాధ్యక్షుడు కిష్టయ్య, జాయింట్ సెక్రటరీ రాజేందర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎల్లేశ్, అధికారులు వాటర్వర్క్స్ జీఎం జాన్షరీఫ్, నాచారం సీఐ కిరణ్కుమార్, డీజీఎం సతీశ్, ప్రాజెక్టు ఆఫీసర్ రమాదేవి, డీఈ రూప, ఏఈ రాజన్న, ఆసర కల్చరల్ కమిటీ జీహెచ్ఎంసీ అధ్యక్షుడు డాక్టర్ నాగేశ్వర్రావు, నేతలు వెంకటేశ్వర్రెడ్డి, సాయిజెన్ శేఖర్, ముత్యంరెడ్డి, శ్రీనివాస్రెడ్డి, వెంకటరమణారెడ్డి, భూపాల్రెడ్డి, సత్యనారాయణ పాల్గొన్నారు.