వనస్థలిపురం, ఆగస్టు 6: నియోజకవర్గంలో ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చేస్తామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎమ్మార్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. శనివారం బీఎన్రెడ్డి నగర్, హస్తినాపురం డివిజన్లలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. బీఎన్రెడ్డినగర్ డివిజన్ టీచర్స్ కాలనీ ఫేజ్-1 సౌత్లో రూ.11లక్షలతో నిర్మించనున్న డ్రైనేజీ పనులను ప్రారంభించారు. శివారులో జనావాసాలు పెరుగుతున్నాయని, వాటిని తగినట్లుగా అభివృద్ధి చేస్తామన్నారు. సబ్స్టేషన్ ఏర్పాటుకు స్థలాన్ని చూసి ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటికే డివిజన్లో స్విమ్మింగ్ పూల్ నిర్మించడం జరిగిందన్నారు. కాలనీ అధ్యక్షుడు విష్ణువర్ధన్రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు కటికరెడ్డి అరవింద్రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ అనిల్ చౌదరి, సీనియర్ నాయకులు జిట్టా రాజశేఖర్రెడ్డి, గజ్జెల మధుసూదన్రెడ్డి, గంగం శివశంకర్, పోగుల రాంబాబు, సువర్ణరెడ్డి, నిర్మలాదేవి, సతీశ్చౌదరి, కొండల్రెడ్డి, బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
హస్తినాపురంలో..
హస్తినాపురం డివిజన్ రెడ్డికాలనీ, హనుమాన్నగర్ శ్రీరమణ కాలనీల్లో అభివృద్ధి పనులను కార్పొరేటర్ సుజాతా నాయక్తో కలిసి ఎమ్మెల్యే సుధీర్రెడ్డి ప్రారంభించారు. డివిజన్లో ముంపు సమస్య ఉన్న సాగర్ ఎన్క్లేవ్, రెడ్డి కాలనీలపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. 80శాతం ముంపు సమస్యను పరిష్కరించామన్నారు. ప్రస్తుత భారీ వర్షాలకు ఎలాంటి ముంపు జరుగలేదన్నారు. నియోజకవర్గంలో ముంపు సమస్య లేకుండా శాశ్వత పరిష్కారానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పద్మానాయక్, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు అందోజు సత్యం చారి, సీనియర్ నాయకుడు గజ్జెల మధుసూదన్రెడ్డి, గోపీరెడ్డి చంద్రశేఖర్రెడ్డి, మేరెడ్డి ఉదయ్కుమార్రెడ్డి, నారగోని శ్రీనివాస్ యాదవ్, లెంకల శ్రీకాంత్రెడ్డి, డేరంగుల కృష్ణ, ఆదిలక్ష్మి, అనిత తదితరులు పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగిఉండాలి
ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎమ్మార్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. వనస్థలిపురం డివిజన్ హస్తినాపురం ఈస్ట్ ఫేజ్-1 కాలనీలో పోచమ్మ ఆలయం ముఖద్వారాన్ని ఏర్పాటు చేశారు. శనివారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వనస్థలిపురం కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వరరెడ్డి, మాజీ కార్పొరేటర్ జిట్టా రాజశేఖర్రెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు గజ్జెల మధుసూదన్రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు చింతల రవికుమార్, ఆలయ చైర్మన్ భూపతిరెడ్డి, చాపల శ్రీనివాస్ యాదవ్, కాలనీ అధ్యక్షుడు భూపతిరెడ్డి, కృష్ణయ్యగౌడ్, అనంతరెడ్డి, రాజవర్ధన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.