ముషీరాబాద్ /కవాడిగూడ/ చిక్కడపల్లి, ఆగస్టు 6 : తెలంగాణ ఉద్యమకారుడు ప్రొఫెసర్ జయశంకర్సార్ అశించినట్టే నేడు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఆయన ఆశాయాన్ని సీఎం కేసీఆర్ నిజం చేశారని తెలిపారు. శనివారం గాంధీనగర్లో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే ముఠా గోపాల్, యు వజన విభాగం నాయకుడు ముఠా జయసింహలు హాజరై జయశంకర్ విగ్రహానికి పూల మాలవేసి నివాళులర్పించారు. గాంధీనగర్ డివిజన్ అధ్యక్షుడు రాకే శ్, పార్టీ సీనియర్ నాయకుడు ముఠా నరేశ్, ఆకుల శ్రీనివా స్, గుండు జగదీశ్ బాబు, ఎర్రం శ్రీనివాస్ గుప్తా, మారిశెట్టి నర్సింగ్రావు, ప్రభాకర్ పాల్గొన్నారు.
జవహర్నగర్లో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ కార్పొరేటర్, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు వి. శ్రీనివాస్రెడ్డి హాజరై జయశంకర్ విగ్రహానికి నివాళులర్పించారు.
ఱైఫొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు ముషీరాబాద్ నియోజకవర్గంలో శనివారం ఘనంగా జరిగాయి. రాంనగర్ చౌరస్తా, అడిక్మెట్ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం, ముషీరాబాద్ బాపూజీనగర్లోని జయశంకర్ విగ్రహానికి ఎమ్మెల్యే ముఠా గోపాల్, మాజీ కార్పొరేటర్ వి.శ్రీనివాస్రెడ్డి, రాంనగర్, అడిక్మెట్ డివిజన్ల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రావులపాటి మోజస్, బి.శ్రీనివాస్రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమాలలో టీఆర్ఎస్ నేతలు టీ సోమసుందర్ పాల్గొన్నారు.
జయశంకర్ చిత్రపటానికి నగర గ్రంథాలయం సంస్థ చైర్పర్సన్ ప్రసన్న నివాళులర్పించా రు. గ్రంథాలయం కార్యదర్శి పద్మజ, ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శాగంటి ఆయోధ్య పాల్గొన్నారు.
డివిజన్లోని ఇందిరానగర్లో ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి ఎమ్మెల్యే నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ జయశంకర్ సార్ ఆశయాలను నెరవేర్చినపుడే ఆయనకు మనమిచ్చే ఘన నివాళి అని అన్నారు.
తెలంగాణ అడ్వకేట్ జేఏసీ కన్వీనర్ పులిగారి గోవర్ధన్రెడ్డి, రాష్ట్ర పుడ్ కమిషన్ సభ్యుడు గోవర్ధన్ రెడ్డిలు కవాడిగూడలోని అడ్వకేట్ జేఏసీ కార్యాలయంలో జయశంకర్ సార్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.