జూబ్లీహిల్స్, ఆగస్టు 5: అంగన్వాడీల బలోపేతానికి తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని, గతంలో ఎవ్వరు పట్టించుకోని ఈ కేంద్రాలకు సొంత భవనాలు ఏర్పాటు చేసేందుకు కృతనిశ్చయంతో ఉందని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు సరైన భవనాలు, సదుపాయాలు లేకుండా కొనసాగించిన అంగన్వాడీ కేంద్రాలను దేవాలయాలకు ప్రతిరూపాలుగా తీర్చిదిద్దిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. రహ్మత్నగర్ డివిజన్ ఎస్పీఆర్ హిల్స్ ఆరోగ్యనగర్లో నాట్కో ట్రస్ట్ సుమారు రూ.45 లక్షలతో నిర్మించిన మోడల్ అంగన్వాడీ భవనాన్ని కార్పొరేటర్ సీఎన్ రెడ్డితో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలకు ఒక కొత్తరూపును ఇచ్చేందుకు రాష్ట్రంలో తొలి మోడల్ అంగన్వాడీ కేంద్రాన్ని నిర్మించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో చిన్నారులకు నాణ్యమైన పోషకాహారాన్ని అందిస్తూ పిల్లలకు పోషణలోపం లేకుండా కంటికి రెప్పలా కాపాడుతున్న ఘనత తెలంగాణ ప్రభుత్వాకే దక్కుతుందన్నారు. గతంలో చిన్న చిన్న గదులలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలకు ఇప్పుడు ఆట వస్తువులతో పాటు ఆటస్థలం, రంగురంగుల బొమ్మలు, కిచెన్, వాష్రూమ్ తదితర సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి అకేశ్వర్రావు, నాట్కో సంస్థ ట్రస్టీ స్వాతి చౌదరి, ప్రతినిధులు డాక్టర్దదదదన్, రాంబాబు, సూపర్వైజర్ రవిత, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.
నాట్కో సేవలు అభినందనీయం
వెనుకబడిన ప్రాంతాలలో విద్యాభివృద్ధికి నాట్కో కృషి విశేషంగా కృషి చేస్తున్నదని, మూడు వేల మందికిపైగా విద్యార్థులతో బోరబండలో అతి పెద్ద ప్రభుత్వ పాఠశాలను సమర్ధవంతంగా నిర్వహించడం ప్రశంసనీయమని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పేర్కొన్నారు. మోడల్ అంగన్ వాడీ ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ బస్తీలలో పేదల కోసం నాట్కో ట్రస్ట్ అందిస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు మన్సూర్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, నాగరాజు, షరీఫ్, రవిశంకర్, చోటు, సాబేర్, రవీందర్ రెడ్డి, కాశీ, కృష్ణ, నర్సింహా, నందు, జబ్బార్, జగన్, విలియం, ద8/5/2022 8:10:39 PM నూజ, లీల, రమ, తబిత పాల్గొన్నారు.