పహాడీషరీఫ్, ఆగస్టు 5: మేనమామ లాగా ప్రతి ఆడబిడ్డ వివాహానికి లక్షరూపాయలకు పైగా అందిస్తున్న గొప్ప మనసున్న మారాజు సీఎం కేసీఆర్ అని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని పహాడీషరీఫ్ ప్రీమియర్ ఫంక్షన్హాల్లో లబ్ధిదారులకు షాదీముబారక్, కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు పేదింటి ఆడబిడ్డలకు కేసీఆర్ ఇచ్చిన గొప్ప వరమన్నారు. ఆడబిడ్డల పెండ్లిళ్లకు మన రాష్ట్రంలో అమలవుతున్న ఈ పథకం దేశంలో ఏ రాష్ట్రంలో లేదన్నారు. ఎంతో మంది పేదింటి ఆడబిడ్డల వివాహాలకు ఆసరగా ఉంటుందన్నారు. గతంలో ఆడపిల్ల పుడితే తల్లిదండ్రులు గుండె మీద కుంపటి అనుకునేవారు. అలాంటిది నేడు ఆడపిల్లలు లక్ష్మీదేవిలాగా, మహారాణులుగా భావిస్తున్నారని తెలిపారు.
సీఎం కేసీఆర్కు ప్రతి ఒక్కరూ అండగా ఉండి ఆశీర్వదించాలన్నారు. రాష్ట్రంలో గతంలో 12 ఉన్న మైనార్టీ గురుకులాలు నేడు 230 ఏర్పాటు చేయగా అందులో 124 జూనియర్ కళాశాలలుగా అప్ గ్రేడ్ చేసినట్లు తెలిపారు. ఇందులో ఒకటి జల్పల్లిలో కూడా ఉందన్నారు. మైనార్టీ కార్పొరేషన్ ద్వారా రూ. 50కోట్ల రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. రూ. లక్ష రుణం తీసుకున్న వారికి 80శాతం, రూ. 2 లక్షలు తీసుకున్న వారికి 70శాతం చొప్పున సబ్సిడీ ఉంటుందన్నారు.
విదేశాలలో విద్యనభ్యసించే విద్యార్థులకు రూ.20 లక్షలు అందిస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కందుకూరు ఆర్డీవో వెంకటాచారి, బాలాపూర్ మండల ఎమ్మార్వో శ్రీనివాస్రెడ్డి, చైర్మన్ అబ్దుల్లా సాది, వైస్ చైర్మన్ పర్హానా నాజ్, కమిషనర్ సుదర్శన్, కౌన్సిలర్లు శంషోద్దీన్, అహ్మద్ కసాది, జాఫర్ బామ్, సయ్యద్ యాహియా, బుడుమాల యాదగిరి, షేక్ పహిమిదా, కొండల్ యాదవ్, అఫ్జల్, ప్రశాంతి శ్రీధర్గౌడ్, అలీ, షేక్ అలీం, టీఆర్ఎస్ నాయకులు ఇక్బాల్ బిన్ ఖలీఫా, యూసుఫ్ పటేల్, యంజాల జనార్దన్, దూడల సుధాకర్గౌడ్, విస్కమూరి నిరంజన్, శ్రీనివాస్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఆపదలో ఆపన్న హస్తం
బడంగ్పేట, ఆగస్టు 5: ఆపదలో ఉన్న వారికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆపన్న హస్తం అందిస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అల్మాస్గూడకు చెందిన దర్శన్కు మంజూరైన రూ.32,500 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహేశ్వరం నియోజకవర్గం వ్యాప్తంగా వేలాది మందికి సీఎం సహాయనిధితో లబ్ధి చేకూరిందన్నారు. ఈ కార్యక్రమంలో దర్శన్, గంట శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.