జూబ్లీహిల్స్, ఆగస్టు 3: నియోజకవర్గంలో అత్యధిక బస్తీలతో ఏర్పాటైన రహ్మత్నగర్, బోరబండ డివిజన్లను మోడల్ కాలనీలుగా అభివృద్ధి చేయనున్నట్లు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పేర్కొన్నారు. బుధవారం రహ్మత్నగర్ డివిజన్ ఎస్పిఆర్ హిల్స్లో సుమారు రూ.11కోట్ల వ్యయంతో చేపడుతున్న వాటర్ రిజర్వాయర్కు కార్పొరేటర్ సీఎన్ రెడ్డి, జలమండలి జీఎం ఎస్.హరిశంకర్తో కలిసి ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మాట్లాడుతూ 40 ఏండ్లక్రితం 31 బస్తీలతో ఏర్పడిన బోరబండ, 25 బస్తీలతో ఏర్పడిన రహ్మత్నగర్లు నగరంలోనే ఎత్తైన ప్రాంతంలో ఉండడంతో తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొనేవని తెలిపారు.
ఈ ప్రాంతంలో ఎన్నికలప్పుడు మాత్రమే కనబడే అన్ని రాజకీయ పార్టీలు ఈ వెనుకబడిన ప్రాంతా ల ప్రజలను ఓట్లకోసం మాత్రమే వాడుకుని వదిలేసేవారని ఆరోపించారు. తాగడానికి నీరు కూడా కరువైన ఈ ప్రాంతాలలో తెలంగాణ ప్రభుత్వం నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా రూ.11 కోట్ల వ్యయంతో భారీ రిజర్వాయర్కు రూపకల్పన చేసిందన్నారు. ఒకప్పుడు నీటి బిందెలతో వీధుల వెంబడి తిరిగే మహిళలకు తెలంగాణ ప్రభుత్వ హయాంలో బోరబండ రిజర్వాయర్తో తాగునీటి సమస్య రాకుండా చేయడంతో పాటు వేసవిలో ఎదురయ్యే నీటి ఎద్దడి నివారణకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, మంత్రి కేటీఆర్లు రిజర్వాయర్ ఏర్పాటుకు నిధులు మంజూరు చేశారన్నారు. గతంలో బురద నీటిలో మునిగిపోయే కార్మికనగర్ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుంతుందన్నారు. దశాబ్దాలుగా వెనుకబడి ఉన్న ప్రాంతాలను అభివృద్ది చేసి చూపిస్తున్నామనడానికి రహ్మత్నగర్, బోరబండ డివిజన్లే నిదర్శనమన్నారు.
ఈ కార్యక్రమంలో జలమండలి మేనేజర్లు రాజేందర్, శ్యామ్, రహ్మత్నగర్.. బోరబండ టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు మన్సూర్, కృష్ణమోహన్, సీనియర్ నాయకులు విజయ్కుమార్, బోరబండ డివిజన్ కో ఆర్డినేటర్ విజయసింహ, డివిజన్ ఇన్ఛార్జి సిరాజ్, ఫయాజ్ ఖాన్, రహ్మత్నగర డివిజన్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, నాగరాజు, షరీఫ్, సరళ, పద్మ, ధనూజ, స్రవంతి, రమ తదితరులు పాల్గొన్నారు.
బండి సంజయ్కు దమ్ముంటే..
టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నగరాన్ని అభివృద్ధి చేసి మాట్లాడుతున్నామని.. అబద్ధాలు చెప్పడంలేదని.. బండి సంజయ్ లాంటి వాళ్ళు అబద్ధాలు చెప్పడానికి మీడియా ముందు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు బీజేపీ పాలిత 18 రాష్ర్టాలలో ఎక్కడా అమలు కావడంలేదని.. ఈ విషయాన్ని బండి సంజయ్ ప్రజలముందు అంగీకరించిన తరువాత దొంగ పాదయాత్రలు చేయాలని దుయ్యబట్టారు. బండి సంజయ్కు దమ్ముం టే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పాదయాత్రచేసి తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిపై మాట్లాడాలని.. ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసి ధరలను ఇస్టం వచ్చినట్లు పెంచుతున్న బీజేపీ ప్రభుత్వం ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.