సిటీబ్యూరో, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): కమాండ్ కంట్రోల్ దేశానికే మణిహారంగా నిలవనున్నదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మంగళవారం నూతనంగా నిర్మించిన కమాండ్ కంట్రోల్ భవనాన్ని మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా, డీజీపీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్, మాగంటి గోపీనాథ్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతశోభన్రెడ్డి, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ అత్యాధునిక టెక్నాలజీతో సుమారు రూ.600 కోట్ల వ్యయంతో కమాండ్ కంట్రోల్ రూమ్ నిర్మించినట్లు చెప్పారు.
ఈ నెల 4 (గురువారం)వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ను ప్రారంభిస్తారని తెలిపారు. దేశంలో ఎకడా లేని విధంగా ఈ కమాండ్ కంట్రోల్ భవనాన్ని ఏర్పాటు చేసినట్లు పేరొన్నారు. జర్మనీ, ఆస్ట్రేలియా, సింగపూర్ లాంటి దేశాల్లో ఉన్న టెక్నాలజీని ఉపయోగిస్తున్నట్లు వివరించారు. అన్ని ప్రభుత్వ శాఖలను అనుసంధానం చేస్తూ కమాండ్ కంట్రోల్ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
రాష్ట్రంలో ఎకడ ఎలాంటి పరిస్థితులు నెలకొన్నా కమాండ్ కంట్రోల్ నుంచి పర్యవేక్షణ ఉంటుందని పేరొన్నారు. డీజీపీ, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ కార్యాలయాల నుంచి కూడా శాంతిభద్రతలను పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. ఇకడి నుండి తక్షణం సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేస్తారని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ మన దేశానికే కాకుండా ఇతర దేశాలకు కూడా ఆదర్శం కానున్నదని తెలిపారు.