గాజులరామారం, జులై 19 : పార్టీలో కష్టపడి పని చేసే ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుందని ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ పార్టీ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు శంబీపూర్ రాజు అన్నారు. మంగళవారం జగద్గిరిగుట్ట డివిజన్ కార్పొరేటర్ కొలుకుల జగన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా డివిజన్ పరిధిలోని వివిధ పార్టీలకు చెందిన నాయకులు ఆయన సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఆయన కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్ జి.సురేశ్ రెడ్డి, టీఆర్ఎస్ యూత్ నియోజకవర్గం అధ్యక్షుడు దూదిమెట్ల సోమేశ్ యాదవ్, టీఆర్ఎస్ నాయకులు విజయ్ రామిరెడ్డి, ఏర్వ శంకరయ్య, పుప్పాల భాస్కర్, పోలే శ్రీకాంత్, మల్లేశ్ గౌడ్, పాపయ్యగౌడ్, పాపిరెడ్డి, దూడల భాస్కర్గౌడ్, డివిజన్ యూత్ నాయకులు రాయి విఘ్నేశ్, కె.సురేశ్, అరవింద్కుమార్, మురళీ యాదవ్, మహేశ్, భాస్కర్, అశోక్, భాస్కర్, నర్సింహ, రాము, గోపాల్, తుకారం, శ్రావణ్, భార్గవ రాజు తదితరులు పాల్గొన్నారు.