జూబ్లీహిల్స్, జూలై 18: తెలంగాణ రాష్ట్ర సమితి క్రమశిక్షణ గల పార్టీ అని.. యువత అందుకే అత్యధికంగా పార్టీలో చేరుతున్నారని టీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పేర్కొన్నారు. అభివృద్ధే తారకమంత్రంగా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలతో అన్ని పార్టీలవారు టీఆర్ఎస్ పార్టీ పట్ల ఆకర్షితులవుతున్నారని అన్నారు. సోమవారం రహ్మత్నగర్ డివిజన్ కార్మికనగర్కు చెందిన యువ నాయకుడు చోటుతో పాటు 300 మంది యువత టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో టీఆర్ఎస్పై విశ్వసనీయతతో అన్ని ప్రాంతాల వారు పార్టీలో చేరుతున్నారని తెలిపారు.
కార్మికనగర్లో 310 మంది గుడిసె వాసులకు సొంత గృహాలు కేటాయించిన ఘనత టీఆర్ఎస్కే దక్కుతుందని, ఎస్పీఆర్ హిల్స్లో రూ.11 కోట్లతో వాటర్ రిజర్వాయర్ నిర్మించడం టీఆర్ఎస్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు నిదర్శనమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన 300 మంది యువ నాయకులు, కార్యకర్తలకు టీఆర్ఎస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ సీఎన్ రెడ్డి, నాయకులు అప్పూఖాన్, తన్నూఖాన్, డివిజన్ అధ్యక్షుడు మన్సూర్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, నాగరాజు, షరీఫ్, సాబేర్, రవిశంకర్, పార్టీలో చేరిన నాయకులు భరత్, మహేశ్ రెడ్డి, శేఖర్, విశాల్, అల్తాఫ్ ఖాన్, ఇబ్రహీం, ప్రవీణ్ కుమా ర్, రత్న, లీల, శేషమ్మ తదితరులు పాల్గొన్నారు.
సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి
ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రతి గడపకు తీసుకువెళ్లేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. హిమాయత్నగర్ డివిజన్కు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు సోమవారం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ ఎస్సీసెల్ విభాగం వైస్ చైర్మన్ పాలడుగు శ్రీనాథ్ నేతృత్వంలో మానవ హక్కుల ప్రొటెక్షన్ ఉపాధ్యక్షుడు అశ్విన్, యూత్ విభాగం ప్రధాన కార్యదర్శి అశోక్లాల్, నాయకులు రవి, దాసరి శ్రీకాంత్తో పాటు 50 మంది కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. సోమవారం ఆదర్శనగర్లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే దానం నాగేందర్ వారికి కండువాలు కప్పి పార్టీలో ఆహ్వానించారు. ఈ సందర్భంగా దానం నాగేందర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని గుర్తించి స్థానిక నాయకులు టీఆర్ఎస్లోకి రావడం సంతోషకరమన్నారు. టీఆర్ఎస్లోకి చేరిన శ్రీనాథ్ మాట్లాడుతూ.. బహుజనులకు కాంగ్రెస్ పార్టీలో సరైన గుర్తింపులేదని, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టీఆర్ఎస్లో చేరినట్లు చెప్పారు. అనంతరం రాజమోహల్లా బస్తీకి చెందిన కమల్కు దళిత బంధు స్కీంలో మంజూరైన కారుకు సంబంధించిన తాళం చెవిని దానం నాగేందర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు యాదగిరి సుతారి, టీఆర్ఎస్ నాయకులు డి.రాజేందర్కుమార్, పి.ప్రభాకర్గౌడ్, యతిరాజ్, కొల్కుల శ్రీకాంత్, నందు, అశోక్, కృష్ణ, మహేశ్, భజరంగ్ పాల్గొన్నారు.