ఆర్కేపురం,జూలై7:సరూర్నగర్ డివిజన్లో బోనాల ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు కృషి చేస్తామని సరూర్నగర్ డివిజన్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణిఅంజన్ పేర్కొన్నారు. బోనాలు సమీపిస్తున్న నేపథ్యంలో బుధవారం సరూర్నగర్ డివిజన్లోని పలు ఆలయాలను ఆమె జీహెచ్ఎంసీ అధికారులతో సందర్శించారు. అనంతంరం అక్కడ ఏర్పాట్లు,మౌలిక వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు.
బోనాల ఉత్సవాలపై సమావేశం
మహేశ్వరం, జూలై 7: ఈనెల 17 నుంచి జరుగబోయే బోనాల ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చైర్మన్ మధుమోహన్ అన్నారు. గురువారం తుక్కుగూడ మున్సిపాలిటీ కార్యాలయంలో బోనాల ఉత్సవాల ఏర్పాట్లపై సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో కరెంటు, తాగునీరు, రోడ్లు తదితర సమస్యలను పరిష్కరిస్తున్నామన్నారు. సూరం చెరువు ఎఫ్టీఎల్ హద్దులు ఏర్పాటు చేయడానికి ఆర్డీవో, తహసీల్దార్, ఇరిగేషన్ అధికారులకు లేఖలను ఇవ్వాలని తీర్మానించామన్నారు.కార్యక్రమంలో కౌన్సిలర్లు యాదగిరిరెడ్డి, శివకుమార్, మౌనిక మహేందర్, పద్మశివయ్య, బాకీవిలాస్, హేమలత రాజు, రవినాయక్, సుమన్, బావనసుధాకర్,రాజు,కమిషనర్జ్ఞానేశ్వర్, మేనేజర్ పర్వతాలు ఉన్నారు.