చిక్కడపల్లి, జూలై 4 : ప్రభుత్వ గురుకులాల ద్వారా పేదలకు నాణ్యమైన విద్యను అందిస్తున్న ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కు దక్కుతుందని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. రాంనగర్ డివిజన్ బాగ్లింగంపల్లిలోని మైనారిటీ బాలికల గురుకుల పాఠశాలలో సోమవారం 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు, చెంపాపేట్లో ఉన్న మైనారిటీ బాలల గురుకుల పాఠశాల విద్యార్థులకు కలిపి సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే విద్యార్థులను సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ గురుకులాల విద్యార్థులు రాణిస్తున్నారని అన్నా రు. సొంత భవనం నిర్మాణానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు.
విద్యార్థులు ముంతాజ్ బేగం ,9.8, రహెనాబేగం 9.7, బాలురు హరినాథ్ 9.5, సైదులు 9.5 మల్లికార్జున్ 9.3, గణేశ్ 9.3 అయాన్ అహ్మద్ 9.0 విద్యార్థులను ఘనంగా సన్మానించారు. బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ శైలజ మాట్లాడుతూ.. 94.3 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులు అయ్యారని తెలిపారు. ఈ కార్యక్రమంలో విజిలెన్స్ విభాగం అధికారి నయీమ్, ఆర్ఎల్సీ జానీమియా, మైనారిటీ బాలల గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ నర్సింహా, టీఆర్ఎస్ రాంనగర్ డివిజన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రావులపాటి మోజస్, మన్నే దామోదర్రెడ్డి, తెలంగాణ హౌస్ఫెడ్ డైరెక్టర్ ఎ. కిషన్రావు, నాయకులు ముచ్చకుర్తి ప్రభాకర్, శివకుమార్యాదవ్, రమేశ్రెడ్డి, టెంపుల్ జనార్దన్, ముదిగొండ మురళి, కొండమడుగు మధు, టీవీ రాజు, కూరగాయల శ్రీను, నిథిన్, మల్లేశ్ యాదవ్, టి.వి. రాజు, కల్పన, వై. సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.