ఉప్పల్, జూలై 4 : ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తున్నామని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. సోమవారం హబ్సిగూ డలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, అలాగే టీఆర్ఎస్ నేత గాయం శ్రీధర్రెడ్డి ఆధ్వర్యంలో ఉచితంగా నోటు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పిస్తూ, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దుతు న్నామని తెలిపారు. త్రెలంగాణ ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తుందని.. దీంతో పభుత్వ పాఠశాలల్లో ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారని అన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రవీందర్రెడ్డి, నేతలు గరిక సుధాకర్, రేపాక కుమారస్వామి, లక్ష్మీనారాయణ, మనోహర్, పూర్ణచందర్, మధు, చందు, నవీన్, నాని పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారానికి చర్యలు
ఉప్పల్, జూలై 4 : ప్రజా సమస్యల తక్షణ పరిష్కారానికి చర్యలు చేపట్టామని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. ఉప్పల్ డివిజన్లోని ముదిరాజ్ శ్మశానవాటికను సోమవారం ఆయన పరిశీ లించారు. ఈ సందర్భంగా ఆయన సమస్యల పరిష్కారానికి తగిన సూచనలు చేశారు. కనీస వసతులు, మరమ్మతులు, బోర్వెల్, దహనవాటిక, గ్రిల్స్ ఏర్పాటుపై అధికారులకు సూచించారు. అ కార్యక్రమంలో ఈఈ నాగేందర్, ఏఈ వసంత, ఉప్పల్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు వేముల సంతోశ్రెడ్డి, ముదిరాజ్ సంఘం ప్రతినిధులు మహంకాళి నరసింహ, రామరాజు, మంద వెంకటేశ్, రమేశ్, పాండు, శంకర్, ఆంజనేయులు, సంతోశ్, దయాకర్, శ్రీనివాస్, చంద్రశేఖర్, నేతలు మస్క సుధాకర్, గరిక సుధాకర్, గుడి మధుసూదన్రెడ్డి, పోగుల సోమిరెడ్డి, స్వీట్హౌజ్ రాజు, ప్రభాకర్, అరిటికాయల వంశీ పాల్గొన్నారు.
రోగులకు సరైన వైద్యం అందించాలి
మల్లాపూర్, జూలై 4 : పేద, మధ్యతరగతి కుటుంబాలకు మీర్పేట్ హెచ్బీకాలనీ డివిజన్లోని లయన్ కంటి వైద్యశాల ఎంతో ఉపయోగకరంగా సేవలను అందిస్తున్నదని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. సోమవారం ఆయన కంటి వైద్యశాలను స్థానిక కార్పొరేటర్ జెర్రిపోతుల ప్రభుదాస్తో సందర్శించి.. రోగులకు సరైన వైద్యం అంది స్తున్న డాక్టర్లను అభినందించారు. అనంతరం కంటి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. కార్యక్రమంలో ముణిరత్నం, వైద్య సిబ్బంది, టీఆర్ఎస్ నాయకులు గరిక సుధాకర్, కాసం మహిపాల్రెడ్డి, నవీన్ గౌడ్, రమేశ్, సాయికుమార్, చంద్రశేఖర్ పాల్గొన్నారు.
కాలనీల సమగ్రాభివృద్ధే ధ్యేయం
చర్లపల్లి, జూలై 4 : నియోజకవర్గ పరిధిలోని కాలనీల సమగ్రాభివృద్ధికి నిధులు కేటాయించి పనులు చేపడుతున్నామని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. చర్లపల్లి డివిజన్, బీఎన్రెడ్డినగర్ సంక్షేమ సంఘం నాయకులు సోమవారం ఎమ్మెల్యే ను కలిసి సమస్యలను వివరించిన అనంతరం ఆషాఢ మాసం బోనాలకు కాలనీకి రావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బీఎన్రెడ్డినగర్లో నెలకొన్న సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అదేవిధంగా ఆషాఢ మాస బోనాల సందర్భంగా ఆలయాల వద్ద సౌకర్యాలు కల్పించడంతో పాటు నిధులు కేటాయించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. సీసీఎస్ ప్రతినిధి పద్మారెడ్డి, ఆలయ కమిటీ అధ్యక్షుడు బోయిని సుభాశ్, డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు డప్పు గిరిబాబు, నాయకులు గంప కృష్ణ, రెడ్డినాయక్, మల్లారెడ్డి, ప్రహ్లాదరెడ్డి పాల్గొన్నారు.