సిటీబ్యూరో, జూలై 4(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మహా నగరంలో ప్రతిష్టాత్మకమైన బోనాల ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రభు త్వం రూ.15 కోట్లను మంజూరు చేసిందని, నగరంలోని ఆలయ కమిటీలు ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం కోసం వెంటనే దరఖాస్తులు అందజేయాలని పశు సంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. సోమవారం మాసబ్ ట్యాంక్లోని తన కార్యాలయంలో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, హోంమంత్రి మహమూద్ అలీ, దేవాదా య, సాంసృతిక, పర్యాటక తదితర శాఖల అధికారులతో కలిసి ఈ నెల 17న జరిగే సికింద్రాబాద్, 24న జరిగే హైదరాబాద్ బోనాల ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై మంత్రి తలసాని సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ బోనాలకు ముందే దేవాలయాలకు ప్రభుత్వ ఆర్ధిక సహాయాన్ని అందించాలని నిర్ణయించిందని, అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
ప్రైవేట్ దేవాలయాలకు ఆర్థిక సహాయం
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బోనాల ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించిందని, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న విషయాన్ని మంత్రి తలసాని గుర్తుచేశారు. ఈ సంవత్సరం కూడా బోనాల ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు రూ.15 కోట్లను మంజూరు చేసింద ని పేరొన్నారు. ఈ నిధులను ప్రభుత్వ పరిధిలోని దేవాలయాలకే కాకుండా ప్రైవేట్ దేవాలయాలకు కూ డా ఆర్ధిక సహాయాన్ని అందిస్తున్నట్లు చెప్పారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో నిర్వహించే బోనాలకు కూ డా తెలంగాణ ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తున్నదని చెప్పారు. పలు ప్రధాన దేవాలయాలకు ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించనున్నట్టు తెలిపారు.
బోనాల విశిష్టతను చాటి చెప్పేలా..
ఈ నెల 25న జరిగే ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు సందర్భంగా 500 మంది కళాకారులతో చార్మినార్ వద్ద, పలు ప్రధాన ఆలయాల వద్ద సాంసృతిక శాఖ కళాకారుల ఆధ్వర్యంలో వివిధ వేషధారణలతో పలు సాంసృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు తెలిపారు. పాత బస్తీలోని దమయంతి బిల్డింగ్, ఢిల్లీ దర్వాజ, గోలొండ, రవీంద్రభారతి, ఇందిరా పారు వద్ద గల కట్ట మైసమ్మ ఆలయం, సికింద్రాబాద్ మహంకాళి ఆలయం, చిలకలగూడ తదితర 8 ప్రాంతాలలో త్రీడీ మ్యాప్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బోనాల ఉత్సవాల విశిష్టతను చాటి చెప్పేలా వివిధ ప్రసార మాధ్యమాలు, కరపత్రాలు, పోస్టర్ల ద్వారా విసృ్తత ప్రచారం కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి కలెక్టర్ అమోయ్ కుమార్, కల్చరల్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, డీఆర్వో సూర్యలత, దేవాదాయ శాఖ ఆర్జేసీ రామకృష్ణ, ఏసీలు బాలాజీ, కృష్ణ, నాగరాజు పాల్గొన్నారు.
ఉజ్జయినీ మహంకాళికి ఆన్లైన్లోనూ బోనాలు
సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. జూలై 3వ తేదీ నుంచి అమ్మవారి ఘటోత్సవాలతో పాటు జాతర ఉత్సవాలను ప్రారంభించారు. ఈ క్రమంలో వివిధ ప్రాంతాల నుంచి ఆన్లైన్లో బుక్ చేసుకున్న 42 మంది భక్తుల బోనాలను దేవాలయ సిబ్బందితో సోమవారం అమ్మవారికి సమర్పించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి గుత్తా మనోహార్రెడ్డి దగ్గరుండి ఈ బోనాల ఉత్సవాన్ని పరిశీలించారు. జూలై 17న బోనాలు, 18న రంగం నిర్వహించనున్నట్టు తెలిపారు. ఇప్పటికే ఆలయంలో జాతర ఏర్పాట్ల పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఆలయానికి రాలేని భక్తులు ఆన్లైన్లో జూలై 28 వరకు బోనాలను సమర్పించవచ్చు. దేవాలయం వెబ్సైట్, మీ సేవ, పోస్టల్, ఆర్టీసీ కార్గోల ద్వారా బుక్ చేసుకోవచ్చు. స్వదేశంలో ఉన్న భక్తులు రూ.500, విదేశాల్లో ఉన్న భక్తులు రూ.1000 చెల్లించి ఈ సేవలు పొందాలి.