సుల్తాన్ బజార్, జూలై 4: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే వైద్య రంగం ఎంతో అభివృద్ధి చెందుతున్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. ఈ మేరకు కోఠిలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన డాక్టర్స్ డే వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఐఎంఏ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు డాక్టర్ సంపత్రావు, ప్రధాన కార్యదర్శి డాక్టర్ నరేందర్రెడ్డి, కోశాధికారి డాక్టర్ గట్టు శ్రీనివాసులులతో కలిసి ఐఎంఏ సావనీర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉత్తమ సేవలందిస్తున్న వైద్యులకు ఆయన శాలువా, జ్ఞాపికలు అందజేసి ఘనంగా సన్మానించారు.
అనంతరం, వినోద్ కుమార్ మాట్లాడుతూ బీసీ రాయ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయనను స్మరించుకునేందుకు గాను ప్రతి ఏడాది డాక్టర్స్ డే వేడుకలను జరుపుకోవడం గొప్ప సంస్కృతి అన్నారు. రాష్ట్రంలో 33 వైద్య కళాశాలలతో పాటు నగరం నలు దిక్కులా వెయ్యి పడకలతో సూపర్ స్పెషాలిటీ దవాఖానాలను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నదన్నారు. రాష్ట్రంలో అత్యధిక సభ్యులున్న ఐఎంఏకు విశాలమైన స్థలం కోసం సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళుతానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ జాతీయ ఉపాధ్యక్షులు డాక్టర్లు ఈ రవీందర్రెడ్డి, ప్రతినిధులు బీ అశోక్, సనేంద్రనాథ్, లింగమూర్తి, ఐఎంఏ మాజీ అధ్యక్షులు లవ కుమార్ రెడ్డి, ప్రతాప్రెడ్డిలతో పాటు వైద్యులు పాల్గొన్నారు.
రెండంచెల సహకారాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా
సహకారం వ్యవస్థలో రెండంచెల విధానానికి టీఆర్ఎస్ ప్రభుత్వం సూత్రప్రాయం గా అనుకూలమని తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. ఈ వ్యవస్థ అమలుకు మంత్రులతో కలిసి సమగ్రంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సఫలీకృతం అయ్యేలా కృషి చేస్తానని అన్నారు. ఇప్పటికే ఈ వ్యవస్థ గురించి అధ్యయనం చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్టు ఆయన తెలిపారు. ఈ మేరకు సోమవారం సహకార బ్యాంకిం గ్ రంగంలో రెండంచెల విధానంపై రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసిన మార్గదర్శకాలను అమలు చేయాలని తెలంగాణ కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ ఎంప్లాయీ స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇంది రా పార్కు ధర్నా చౌక్లో మహాధర్నా ను నిర్వహించారు.
ఈ సందర్భంగా హాజరైన రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్ర సహకార బ్యాంకుల (టీఎస్ జిల్లా సహకార బ్యాంకు (డీసీసీబీ)ల విలీనమే పలు సమస్యలకు పరిష్కారమని అన్నారు. సహకార బ్యాంకులలో హెచ్ఆర్ పాలసీకి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని, ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు త్వరలో విడుదలవుతాయని అన్నారు. వాణిజ్య బ్యాం కులతో పోటీపడి సహకార బ్యాంకులు నిలదొక్కుకుంటున్నాయని అభినందించారు. రాష్ట్ర స్థాయి లో సహకారం రంగం బలంగా ఉందని, అదే విధంగా జిల్లా సహకారం బ్యాంకింగ్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలియజేశారు. వ్యవసాయ రంగంలో సహకార ఉద్యమం రావాల్సినవసరం ఉందని అన్నారు. బీఎస్ రాములు, పల్లా వెంకట్రెడ్డి, వీఎస్ బోస్, కె.జనార్దన్ రావులు పాల్గొన్నారు.