సిటీబ్యూరో, జూలై 4 (నమస్తే తెలంగాణ): బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో సోమవారం నుంచి బుధవారం వరకు జరిగే ఎల్లమ్మ కల్యాణ మహోత్సవం, రథోత్సవాలకు భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతారని నగర ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ తెలిపారు. ఈ సందర్భంగా సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ఆలయ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, ట్రాఫిక్ను మళ్లిస్తున్నట్లు వెల్లడించారు. ఆయా రూట్లలో వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని జాయింట్ సీపీ సూచించారు.