సిటీబ్యూరో, జూలై 2(నమస్తే తెలంగాణ)/మన్సూరాబాద్ : ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసమే సీఎం కేసీఆర్ గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేశారని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ కార్యదర్శి షఫీఉల్లా తెలిపారు. నాగోల్ డివిజన్ ఆనంద్నగర్ చౌరస్తాలోని తెలంగాణ మైనార్టీ గురుకుల పాఠశాల(బాలానగర్ గర్ల్స్-1)లో శనివారం రంగారెడ్డి జిల్లా పరిధిలోని మైనార్టీ గురుకుల పాఠశాలల్లో ఇంటర్, 10వ తరగతి ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థుల అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థులతో కలిసి కేక్కట్ చేశారు.
పదవ తరగతి, ఇంటర్లో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను ఆయన అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆకాంక్షలకు అనుగుణంగా విద్యాబోధనలు చేస్తూ విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతూ వారి బంగారు భవిష్యత్తుకు పునాదులు వేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మైనార్ట్సీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ సహాయ కార్యదర్శి లియాకత్ హుస్సేన్, విజిలెన్స్ టీమ్ అధికారులు రహీం, రెహమాన్, ఆర్ఎల్సీ శ్రీనివాస్ రెడ్డి, ప్రిన్సిపాల్ పి. వినీల, తెలుగు ఎస్ఆర్పీ విద్యాపతి తదితరులు పాల్గొన్నారు.