రంగారెడ్డి, జులై 2(నమస్తే తెలంగాణ): పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు గాను బడంగ్పేట్ మేయర్పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు శనివారం బడంగ్పేట్ కార్పొరేషన్ మేయర్తో పాటు ఇద్దరు కార్పొరేటర్లను టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. బడంగ్పేట్ మేయర్ పారిజాత నర్సింహారెడ్డి, కార్పొరేటర్లు పెద్దబావి సుదర్శన్ రెడ్డి, రాళ్లగూడ శ్రీనివాస్లను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు మంచిరెడ్డి తెలిపారు. పార్టీ నిబంధనలు ఉల్లంఘించిన వారు ఎంతటి స్థాయి వారైనా ఉపేక్షించేది లేదన్నారు. పార్టీని ధిక్కరిస్తున్న వారిపై చర్యలు తప్పవన్నారు. పార్టీలో ఉన్నవారు క్రమశిక్షణకు కట్టుబడి పనిచేయాలని జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి సూచించారు.