అబిడ్స్, జూలై 2 : నగరం నడిబొడ్డున రెండు ఇంజినీరింగ్ విద్యా సంస్థలను నెలకొల్పి అనేక మంది విద్యార్థులకు ఉన్నతమైన విద్యనందించేందుకు విశేష కృషి చేస్తున్న స్టాన్లీ మహిళా ఇంజినీరింగ్ కళాశాల చైర్మన్ కృష్ణారావును అమెరికన్ తెలుగు అసోసియేషన్ సత్కరించింది. అమెరికాలో జరిగిన ఆటా మహాసభల్లో రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి , విశాఖ ఎంపీతోపాటు తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్లు కృష్ణారావును సన్మానించి జ్ఞాపికను అందజేశారు.
ఈ సందర్భంగా ఆటా ప్రతినిధులు కృష్ణారావు విద్య, పారిశ్రామిక రంగంలో చేపట్టిన ప్రగతిని సభలో స్క్రీన్పై ప్రదర్శించారు. సఫల ఆర్గానిక్స్ సీఎండీగా ఆయన గొప్ప పారిశ్రామికవేత్తగా నిలిచాడని ఆటా ప్రతినిధులు కొనియాడారు. నాణ్యమైన విద్యనందించడంలో అవిరళమైన కృషి సలుపుతానని, అమెరికన్ తెలుగు అసోసియేషన్ తన బాధ్యతను మరింత పెంచిందని స్టాన్లీ ఇంజినీరింగ్ మహిళా కళాశాల చైర్మన్ కృష్ణారావు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.