సిటీబ్యూరో, జూలై 1 (నమస్తే తెలంగాణ) :ఇందిరాపారు, కేబీఆర్ పార్ గేట్-1, కేబీఆర్ పార్ గేట్- 3, కేబీఆర్ పార్ గేట్-6, ట్యాంక్బండ్ (కందుకూరి వీరేశలింగం విగ్రహం వద్ద), బషీర్బాగ్ రోడ్డు (ఒత్రిస్ రెస్టారెంట్ ఎదురుగా), గన్ఫౌండ్రి (మహబూబియా బాలికల జూనియర్ కాలేజీ), అబిడ్స్ జీపీవో, నానక్రామ్గూడ (జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ కాంప్లెక్స్), హరిణి వనస్థలి నేషనల్ పార్, ఉప్పల్ శిల్పారామం (మెట్రో ఆఫీస్), ఉప్పల్ (మెట్రోస్టేషన్ పారింగ్), ఒవైసీ హాస్పిటల్ (సంతోష్నగర్), తాజ్ త్రీస్టార్ హోటల్ (ఎస్డీ రోడ్డు)
వాహన కాలుష్యం, చమురు వాడకాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విశేష కృషి చేస్తున్నాయి. మండుతున్న ఇంధన ధరలతో ప్రజలు సైతం ఈవీలపై ఆసక్తి చూపుతున్నారు. దీనికితోడు ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు, ప్రోత్సాహకాలతో విద్యుత్ వాహనాల వాడకం పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ పరిధిలో 230, హెచ్ఎండీఏ పరిధిలో 100 పబ్లిక్ చార్జింగ్ సెంటర్ల ఏర్పాటుకు ప్రతిపాదించారు.
టీఎస్ రెడ్కోతో ఒప్పందం..
ఎలక్ట్రిక్ వాహనాల పాలసీకి రాష్ట్ర నోడల్ ఏజెన్సీ అయిన టీఎస్ రెడ్కో నగరంలో పలు చోట్ల ఈవీల కోసం పబ్లిక్ చార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు బల్దియాతో ఒప్పందం చేసుకుంది. ఇందులోభాగంగా బల్దియా ద్వారా 230 ప్రాంతాలు, హెచ్ఎండీఏ పరిధిలో 100 ఏరియాలకు సంబంధించిన జాబితాను టీఎస్ రెడ్కోకు అందజేశారు. ప్రతి లొకేషన్లో ఫాస్ట్ స్పీడ్, స్లో స్పీడ్ చార్జింగ్ సెంటర్లు ఉంటాయి. ఫీజిబిలిటీ బట్టి యుద్ధ ప్రాతిపదికన పబ్లిక్ చార్జింగ్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు.
ప్రయోగాత్మకంగా 14 చోట్ల ..
పబ్లిక్ చార్జింగ్ సెంటర్ల వినియోగంతో పాటు తద్వారా వచ్చే ఆదాయాన్ని అంచనా వేసేందుకు ప్రయోగాత్మకంగా తొలుత 14 ప్రాంతాల్లో చార్జింగ్ కేంద్రాలను నెలకొల్పాలని టీఎస్ రెడ్కో నిర్ణయించింది. టీఎస్ రెడ్కో యూనిట్కు రూపాయి చొప్పున బల్దియాకు ప్రతి మూడు నెలల కొకసారి చెల్లింపులు చేస్తుంది. ఫాస్ట్ చార్జింగ్ కెపాసిటీ ఉన్నవి (డీసీ -001 (15కిలో వాట్)) ఒకటి చొప్పున మొత్తం 14 లొకేషన్లలో ఏర్పాటు చేయనున్నారు. అక్కడే (122-150 కిలోవాట్) సామర్థ్యం గలవి ఒకొకటి 2 చొప్పున టీఎస్ రెడ్కో నెలకొల్పనున్నది.