దుండిగల్,జులై1: కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించడంతో పాటు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిచేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే వివేకానంద్ అన్నారు.మన బస్తీ- మన బడి కార్యక్రమంలో భాగంగా దుండిగల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రూ.85లక్షలతో చేపట్టనున్న డైనింగ్ హాల్,కిచెన్ షెడ్డు,టాయిలెట్లు,తాగునీటి సౌకర్యం వంటి అభివృద్ధి పనులకు శుక్రవారం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన బస్తీ- మన బడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మారనున్నాయని,ఇప్పటికే ఆంగ్లమాద్యంలో విద్యను అందిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో డీఈవో ఆంజనేయులు,ఉన్నత పాఠశాల ప్రిన్సిపాల్ సత్యనళిని,ప్రాధమిక పాఠశాల ప్రిన్సిపాల్ ఎండి ఫసీయుద్దీన్, ఎంఆర్పీ,రమేష్,ఏఈ నాగేశ్వరరావు,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
కార్యకర్తల కుటుంబానికి బీమా చెక్కు అందజేత
దుండిగల్ మున్సిపపపాలిటీ పరిధి నాలుగూరు గ్రామానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త మాసిని రాజు (29) గత సంవత్సరం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు.అతను టీఆర్ఎస్ సభ్యత్వం నమోదు చేసుకో గా ప్రమాదబీమా కింద రూ.2లక్షలు మంజూరయ్యాయి. సదరు చెక్కును శుక్రవారం ఎమ్మెల్యే స్వయంగా రాజు ఇంటికి వెళ్లి అతని భార్య కవితకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో పార్టీ కార్యకర్తలకు ప్రమాద భీమా సౌకర్యాన్ని అందిస్తున్న ఏకైక పార్టీ టీఆర్ఎస్ అని అన్నారు. కార్యక్రమంలో మేడ్చల్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ రవీందర్యాదవ్,మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు గోపాల్రెడ్డి,దుండిగల్ మున్సిపల్ టీఆర్ఎస్ అధ్యక్షుడు సంజీవరెడ్డి,ఏపీసీఎస్ వైస్ చైర్మన్ కృష్ణ,నిజాంపేట్ కార్పొరేషన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు రంగరాయప్రసాద్,జీహెచ్ఎంసీలోని పలు డివిజన్ల అధ్యక్షులు రుద్రఅశోక్, భాస్కర్, శ్రీకాంత్ ఉన్నారు. అంతకు ముందు నాగులూరులో పర్యటించిన ఎమ్మెల్యే, స్థానికంగా జరుగుతున్న కమ్యూనిటీ హాల్ నిర్మాణపనులను పరిశీలించి,త్వరగా పనులు పూర్తిచేసి,ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని,సంబంధిత అధికారులు,గుత్తేదారుకు సూచించారు.
రోడ్డు విస్తరణ బాధితులకు పరిహారం అందజేత
కుత్బుల్లాపూర్,జూలై1:కుత్బుల్లాపూర్ గ్రామంలో రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా ఇండ్లు కోల్పోయిన పది మంది బాధిత కుటుంబాలకు శుక్రవారం ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ తన క్యాంపు కార్యాలయంలో రూ.83 లక్షల 35 వేల 366 విలువ గల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ మాట్లాడుతూ గతంలో ఇండ్లు కోల్పోయిన 38 మంది భాదిత కుటుంబాలకు పరిహారం అందజేశామన్నారు. పెండింగ్లో ఉన్న మరో 30 మందికి త్వరలోనే అందించేందుకు తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సర్కిల్ టౌన్ప్లానింగ్ అధికారి వికాస్, చైన్మెన్ నరహరి, న్యాక్ ఇంజనీర్ జయశ్రీ తదితరులు పాల్గొన్నారు.
సామాజిక ఉద్యమనేత డా.జేబీ రాజు 83వ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని సూరారం భీమా గార్డెన్స్లో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హజరై శుభాకాంక్షలు తెలిపారు.
సూరారం 129 డివిజన్ పరిధిలోని శివాలయ నగర్ హోస్సన్న పెంటికొస్తల్ ఫెయిత్ మినిస్ట్రీస్ చర్చిలో దేశ, రాష్ట్ర, నియోజకవర్గ క్షేమం కోసం క్రైస్తవులు చేపట్టిన 12 గంటల ఉపవాస ప్రార్థన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాజరయ్యారు.కార్యక్రమంలో సంఘం పెద్దలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.