ఖైరతాబాద్, జూలై 1 : ‘బీజేపీ జాతీయ సభల ఏర్పా ట్లు.. ఆ నాయకుల తీరు చూస్తుంటే.. బ్రిటీష్ వారు భారతదేశంపై దండయాత్ర చేసినట్లు ఉన్నదని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి అన్నారు. లక్డీకాపూల్లోని హోటల్ సెంట్రల్ కోర్టులో శుక్రవారం సాయం త్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గిరిజన మహిళా అయినద్రౌపది మురుమును రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో ఆ వర్గాల ప్రజల సమస్యలను ముందుగా పరిష్కరించాలని అన్నారు. తెలంగాణలో ఏ నాటి నుంచో పెండింగ్లో ఉ న్న గిరిజన యూనివర్సిటీ ఏమైందని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలను మభ్యపెట్టడం కోసం నిరంతరం చెబుతున్న సమస్య కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఇంత వరకు ఇవ్వలేదని అన్నారు.
బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు అని ఉద్యమిస్తున్న గిరిజనులకు బయ్యారం ఉక్కు పరిశ్రమను అందించలేదని తెలిపారు. కాళేశ్వరం, మిషన్కాకతీయకు లాంటి ప్రాజెక్టులకు నిధులు ఇవ్వకపోగా, వాటికి జాతీయ హోదా ప్రకటించలేదన్నారు. బీసీ బిడ్డనని చెబుతున్న ప్రధాని మోదీ బీసీ కుల గణన ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. బీజేపీ జాతీ య కార్యవర్గ సభల్లో తెలంగాణ వంటకాలు, కాకతీయ ప్రాంగణం, తెలంగాణ ఎగ్జిబిషన్ లాంటి పేర్లు వాడుతున్నారని, తెలంగాణ వచ్చిన తర్వాత ప్రధాని మోదీ ఎన్నో సార్లు ఈ ప్రాంతంపై వ్యతిరేకంగా మాట్లాడారని, కాబట్టి ఆ పేర్లు పెట్టుకోవడానికి బీజేపీకి అర్హత లేదన్నారు.
రిజర్వేషన్లు ఎందుకు పెంచలేదు..
దేశంలో 2014 నుంచి నేటి వరకు రాష్ట్రపతిగా ఉన్న వ్యక్తి రిజర్వేషన్లు ఎందుకు పెంచలేదని ప్రశ్నించారు. ప్రధాని మోదీ, మంత్రి అమిత్షా కనుసన్నల్లో ఉండే రాష్ట్రపతిని పెట్టుకుంటున్నారని అన్నారు. నేడు మరో గిరిజన మహిళా రాష్ట్రపతిని ప్రకటించారని, ఆమె ఉన్న ఒడిషాలో ఎంతో మంది గిరిజనులపై దాడులు జరిగాయని, ఒక్కనాడు కూడా ఆమె ఎందుకు ఖండించలేదని అన్నారు. ప్రధానిగా నరేంద్ర మోదీ అయిన తర్వాత రాజ్యాంగం పరిధిలో ఉన్న దళిత, గిరిజన, బీసీ రిజర్వేషన్లను అమలు చేయడం లేదని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రం లో 90వేల ఉద్యోగాలు ప్రకటించారని, తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు 1.20లక్షల ఉద్యోగాలు ఇ చ్చారని, అంటే మొత్తం 2లక్షల 10వేల ఉద్యోగాలు ఇక్కడి యువతకు ఇచ్చారని గుర్తు చేశారు.
అదే విధంగా 2014 లో సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదన్నారు. నేడు ప్రధాన మంత్రిని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శనం చేయిస్తానని చెబుతున్నారని, ముందుగా హిందువులకు ఏం చేశారో స్పష్టం చేయాలని, హిందు ముసుగులో బీజేపీ హిందువులనే మోసం చేస్తుందన్నారు. బీజేపీ ఇలాంటి పది సభలు పెట్టినా ఇక్కడి ప్రజలు నమ్మరని అన్నారు. ఈ సమావేశంలో టీఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు ఇటుక రాజు, బాబు రావు, నర్సయ్య పాల్గొన్నారు.