వెంగళరావునగర్, జూన్ 30 : పది ఫలితాల్లో సోమాజిగూడ డివిజన్లోని ఎల్లారెడ్డిగూడ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు సత్తాచాటారు. 33 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవ్వగా 28 మంది ఉత్తీర్ణులయ్యారని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు యాదయ్య తెలిపారు. 85% ఫలితాలు సాధించడంతో ఎల్లారెడ్డిగూడ ప్రభుత్వ పాఠశాల మొదటి స్థానంలో నిలిచిందన్నారు. జోయల్ రాజ్ 9.7, కావేరి 9.3, దుర్గా భవాని 9.2, సంధ్యారాణి 9.0, సాయివేణు 9.0 గ్రేడ్లను సాధించారు.
యూసుఫ్గూడ పాఠశాలలో..
యూసుఫ్గూడ ప్రభుత్వ పాఠశాలలో 73 శాతం ఉత్తీర్ణత, శ్రీరాంనగర్ ప్ర భుత్వ పాఠశాలలో 66 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఆయా పాఠశాలల్లో బాలికలే టాపర్లుగా నిలిచారు. యూసుఫ్గూడ పాఠశాలలో మొత్తం 135 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 98 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఈ పాఠశాలలో జయంతి 9.3 జీపీఏతో టాపర్గా నిలిచింది. శ్రీరాంనగర్ ప్రభుత్వ పాఠశాలలో 68 విద్యార్థులకుగానూ 48 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఈ పాఠశాలలో సాయి భవాని 9.5 జీపీఏతో టాపర్గా నిలిచింది. ఖైరతాబాద్ జోన్లో 68 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు డిప్యూటీ డీఈఓ చిరంజీవి తెలిపారు. ఇందులో 7 గురు విద్యార్థులు 9.5 నుంచి 10 జీపీఏ సాధించగా ఆరుగురు బాలికలే ఉన్నారు.
గురుకుల పాఠశాలలో…
గురుకుల(బాలికల) పాఠశాల నుంచి 69 మంది బాలికలు పరీక్షలకు హాజరుకాగా వంద శాతం పాసయ్యారు. గురుకుల(బాలురు) పాఠశాల నుం చి 84 మంది పరీక్షకు హాజరుకాగా అందులో 82 మంది ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణత శాతం 97.6 గా నమోదైంది. వెంకటేశ్ 9.2 పాయింట్లు సాధించి స్కూల్ టాపర్గా నిలిచాడు. బోరబండలోని నాట్కో ప్రభుత్వఉన్నత పాఠశాల ఉత్తీర్ణత శాతం 68 నమోదైంది. ఈ పాఠశాల నుంచి మొత్తం 263 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 179 మంది ఉత్తీర్ణులయ్యారు. పింకి 9.8 పాయింట్లను సాధించి స్కూల్ టాపర్గా నిలిచింది.
న్యూబోయిగూడ పాఠశాలలో..
న్యూబోయిగూడలోని ప్రభుత్వ ఉ న్నత పాఠశాలకు చెందిన ఎం సిరి 8.5 శాతం జీపీఏ సాధించి, స్కూల్ టాపర్గా నిలిచిందని పాఠశాల హెచ్ఎం శోభ తెలిపారు. బోయిగూడకు చెందిన సిరి తండ్రి నర్సింహ ఆటోడ్రైవర్ అని, వారిది పేద కుటుంబమని తెలిపారు. 44 మంది పరీక్షలు రాయగా 14 మంది పాసయ్యారని హెచ్ఎం తెలిపారు.
మైనార్టీ బాలుర పాఠశాలలో..
మైనార్టీ బాలుర పాఠశాల విద్యార్థులు పది ఫలితాల్లో ప్రతిభ కనబరచారని ప్రిన్సిపాల్ పైళ్ల ప్రకాశ్రెడ్డి తెలిపారు. ఎల్బీనగర్లోని నందనవనంలో రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాల కొనసాగుతుందన్నారు. య శ్వంత్, సందీప్లు 9.7 జీపీఏ, మి గతా విద్యార్థులు 9 జీపీఏ పైగా సాధించారని తెలిపారు.
టాపర్గా హిమబిందు
అమీర్పేట్ ప్రభుత్వ పాఠశాలకు చెందిన హిమబిందు టాపర్గా నిలిచింది. 81 మంది పరీక్షలు రాయగా 65 మంది ఉత్తీర్ణత సాధించారు. హిమబిందు 9.8 జీపీఏ సాధించి టాపర్గా నిలువగా హెచ్ఎం మధుకర్ అభినందించారు.
బధిరుల పాఠశాలలో ..
బధిర విద్యార్థులు పదోతరగతి పరీక్షల్లో సత్తా చాటారు. శ్రీనగర్ కాలనీ ఆశ్రయ్-ఆకృతి స్వచ్ఛంద సంస్థకి చెందిన బధిరుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులు విజయదుందుభి మోగించారు. 16 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా అందరూ మంచి మార్కులు సాధించి ఉత్తీర్ణత సాధించారు. వీరిలో వైష్ణవి, కల్యాణి 9 జీపీఏ తో సాయి ఆకాశ్,బి.ఎస్.లాస్య,సారికలు 8.8 జీపీఏ సాధించారు. మిగతా విద్యార్థులు 8.5 జీపీఏ సాధించారు.