వ్యవసాయ యూనివర్సిటీ, జూన్ 29: దేశంలో ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సాగులో మార్పు తీసుకు రావాలని ఐసీఎఆర్ మాజీ డీడీజీ కాన్ఫడరేషన్ ఆఫ్ హార్టికల్చర్ అసోషియేషన్ ఆఫ్ ఇండియా ఫౌండర్ చైర్మన్ డా.హెచ్పీ సింగ్ అన్నారు. బుధవారం ప్రొ. జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, అగ్రికల్చర్ సొసైటీ ఆధ్వర్యంలో రాజేంద్ర నగర్ టీజేటీఎస్ఏయూ ఆడిటోరియంలో డా. ఎల్ వెంకటరత్నం రెండో స్మారకోపన్యాస కార్యక్రమం జరిగింది. సస్టయినబుల్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ చాలెంజెస్ అండ్ అపార్చునిటీస్ ఎస్స్పెషల్ ఫోకస్ఆన్ తెలంగాణ స్టేట్ అనే అంశంపై ఆయన ప్రసంగించారు. దేశంలో హార్టికల్చర్ రంగ అభివృద్ధికి వెంకట రత్నం అవిరళ కృషి చేశారని సింగ్ అన్నారు.
స్వాతంత్య్రం రాకముందు కేవలం ఉన్నత వర్గాలకే పరిమితమైన హార్టికల్చర్ ప్రస్తుతం అపూర్వ అభివృద్ధి చెందుతుందన్నారు. వాతావరణ మార్పులను తట్టుకునే విధంగా పంటల సరళిలో మార్పులు రావాలని, కొత్తవంగడాలని రూపొందించాలని సూచించారు. హార్టికల్చర్ ఉత్పత్తి, ఉత్పాదకతలు పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ హార్టికల్చర్కు అనువైన ప్రాంతమని రాష్ట్ర హార్టికల్చర్ కమిషనర్ ఎల్. వెంకట్రామిరెడ్డి అన్నారు. కార్యక్రమంలో అగ్రిహర్టికల్చర్ సొసైటీ కార్యదర్శి డా. ఏవీ రావు, సొసైటీ చైర్మన్ అనిల్ కుమార్ , వి.ఏపూర్, వైఎస్ఎమ్(రిటైర్డ్) కేవీ సుబ్రహ్మణ్యం వర్సీటీ డీన్ ఆఫ్ టీజీస్టడీస్ డా. వి . అనిత, డీన్ ఆఫ్ అగ్రికల్చర్ డా. సీమ, శాస్త్రవేత్తలు , విద్యార్థులు పాల్గొన్నారు.