మహేశ్వరం, జూన్ 29: ఫ్యాబ్సిటీ.. ఈసిటీ భూ నిర్వాసితులకు లాటరీ పద్ధతిలో ప్లాట్లను ఎంపిక చేసినట్లు కందుకూరు డివిజన్ ఆర్డీవో వెంకటాచారి తెలిపారు. మండల పరిషత్ కార్యాలయం వద్ద బుధవారం ఫ్యాబ్సిటీ, ఈ సిటీలో భూములు కోల్పోయిన రైతుల కోసం నిర్వహించిన కార్యక్రమంలో తాసీల్దార్ ఆర్పీ జ్యోతితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫ్యాబ్ సిటీ భూముల్లో ఎలాంటి పట్టాలు లేకుండా చాలామంది రైతులు కబ్జాలో ఉన్నారని, వారందరికీ ప్రభుత్వ పరంగా తగిన న్యాయం చేస్తామని తెలిపారు. ఒక ఎకరా స్థలం ఉన్న సీలింగ్ భూమి వారికి ఒక్కొక్కరికీ 250 గజాలు, కబ్జాదారులకు 150 గజాల చొప్పున స్థలం ఇస్తున్నామని పేర్కొన్నారు. లాటరీ పద్ధతి ద్వారా 130 మంది రైతులకు ప్లాట్లను ఎంపిక చేశామని తెలిపారు.
ప్రతి రైతు తమ ప్లాట్లను అమ్ముకునే విధంగా ప్రతి ఒక్కరికీ కన్వెన్స్ డీడ్ లను రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని తెలిపారు. త్వరలోనే రైతులందరికీ రిజిస్ట్రేషన్ చేస్తామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో తుక్కుగూడ మున్సిపాలిటీ చైర్మన్ కాంటెకార్ మధుమోహన్, కౌన్సిలర్లు బోధ యాదగిరిరెడ్డి, ఎరుకల శివకుమార్, రాగమోని మౌనిక మహేందర్, జాపాల భావన సుధాకర్ తుక్కుగూడ మున్సిపాలిటీ టీఆర్ఎస్ అధ్యక్షుడు జెల్లల లక్ష్మయ్య, నాయకులు బాట సురేశ్, లింగం, సురేశ్, ఫ్యాబ్ సిటీలో భూములు కోల్పోయిన రైతులు పాల్గొన్నారు.