సిటీబ్యూరో/ రంగారెడ్డి/ మేడ్చల్, జూన్ 28 (నమస్తే తెలంగాణ): ఇంటర్మీడియట్ (2021-22 పరీక్ష) ఫలితాలలో గ్రేటర్ (రంగారెడ్డి, మేడ్చ ల్) హైదరాబాద్ వ్యాప్తంగా బాలికలు పై చేయి సాధించారు. ఇంటర్మీడియట్ ఫస్టియర్తో పాటు సెకండియర్ ఫలితాలలో కూడా బాలికల హవా కొనసాగించారు. మూడు జిల్లాలలోనూ బాలికల హవా కొనసాగింది. హైదరాబాద్ జిల్లా వ్యాప్తం గా మొత్తం ఇంటర్ సెకండియర్ పరీక్షల కోసం 65,868 మంది విద్యార్థులు హాజరు కాగా, వారిలో 42,170 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఫస్టియర్లో 77,369 మంది విద్యార్థులు హాజరు కాగా, వారిలో 47,485 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. సెకండియర్లో 33,667 మంది బాలురు పరీక్షలకు హాజరు కాగా, వారిలో 32,201 మంది ఉత్తీర్ణత సాధించారు. 32,201 మంది బాలికలు హాజరు కాగా, 23,897 మంది ఉత్తీర్ణత సాధించారు.
అలాగే, ఫస్టియర్లో 38,780 మంది బాలురు హాజరు కాగా, 20,300 మంది ఉత్తీర్ణత సాధించారు. 38,589 మంది బాలికలు హాజరు కాగా, వారిలో 27,545 మంది ఉత్తీర్ణత సాధించినట్లు జిల్లా అధికారులు వెల్లడించారు. సెకండియర్లో బాలికలు 74.21 శాతం ఉతీర్ణత నమోదు చేయగా, బాలురు 54.27 శాతం ఉత్తీర్ణులయ్యారు. ఫస్టియర్ ఫలితాలలో బాలికలు 71.28 శాతం ఉత్తీర్ణత సాధించగా, బాలురు 52.34 శాతం నమోదు చేసినట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి ఓడెన్న మంగళవారం తెలిపారు. అలాగే 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్ సెకండియర్ పరీక్ష ఫలితాలలో 64.02 శాతం, ఫస్టియర్లో 61.37 శాతం ఉత్తీర్ణత నమోదు చేశారు. 2020 సంవత్సరంతో పోల్చితే మొత్తం సెకండియర్లో ఐదు శాతం ఉత్తీర్ణత పెరిగిందన్నారు. ఫస్టియర్లో 11.36 శాతం ఉత్తీర్ణత నమోదైందన్నారు.
ఒకేషనల్ విద్యలో బాలికలదే పై చేయి..
ఇంటర్మీడియట్ ఒకేషనల్ కోర్సులో జిల్లాలో 67.12 శాతం బాలికలు ఉత్తీర్ణత సాధిస్తే.. బాలురు మాత్రం 37.38 శాతంతో ఉత్తీర్ణత సాధించారు. అలాగే, సెకండియర్లో 76.66 శాతం మంది బాలికలు ఉత్తీర్ణత సాధించగా.. 43.68 శాతం బాలురు ఉత్తీర్ణత సాధించారు.
నాలుగో స్థానంలో రంగారెడ్డి..
ఇంటర్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో రంగారెడ్డి జిల్లా నాలుగో స్థానంలో నిలిచింది. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 72 శాతం ఉత్తీర్ణత సాధించగా, ద్వితీయ సంవత్సరంలో 75 శాతం మేర విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో 56,359 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా, 41,056 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు, వీరిలో 29,634 మంది బాలురుకు గాను 19,956 (67 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. బాలికలకు సంబంధించి 26,725 మందికి గాను 21,100(78 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. అదే విధంగా ద్వితీయ సంవత్సరం పరీక్షలకు సంబంధించి 52,265 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 39,410 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.
వీరిలో బాలురు 28,000 మంది పరీక్షలకు హాజరు కాగా 19,703(70 శాతం) మంది ఉత్తీర్ణులు, బాలికలకు సంబంధించి 24,265 మందికి గాను 19,707(81 శాతం) మంది బాలికలు ఉత్తీర్ణత సాధించారు. అదే విధంగా ఇంటర్మీడియట్ ఒకేషనల్కు సంబంధించి మొదటి సంవత్సరంలో 3,327 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 47 శాతంతో 1590 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. వీరిలో బాలురు 1804 మంది విద్యార్థులకు గాను 569 (31 శాతం) మంది విద్యార్థులు, బాలికలకు సంబంధించి 1523 మంది విద్యార్థినులకు గాను 1021(67 శాతం) మంది విద్యార్థినులు ఉత్తీర్ణులయ్యారు. ఒకేషనల్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో 58 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. బాలురు 1622 మందికి గాను 793(48 శాతం) మంది విద్యార్థులు, బాలికలకు సంబంధించి 1127 మందికి గాను 828(73 శాతం) మంది విద్యార్థినులు ఉత్తీర్ణత సాధించారు.
నెంబర్వన్గా మేడ్చల్ జిల్లా..
ఇంటర్ ఫలితాలలో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా రాష్ట్రంలో నెంబర్వన్ స్థానంలో నిలిచింది. ఇంటర్మీడియట్ ఫలితాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 76 శాతం, రెండవ సంవత్సరంలో 78 శాతంలో విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో 52867 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 40703 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా ఇందులో బాలురు 28830 పరీక్షలు రాయగా 21014 ఉత్తీర్ణత సాధించగా బాలికలు 24037 పరీక్షలు రాయగా 19689 ఉత్తీర్ణత సాధించారు. రెండవ సంవత్సరం విద్యార్థులు 48821 పరీక్షలు రాయగా 38450 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాలురు 26007 పరీక్షలు రాయగా 19213 ఉత్తీర్ణత సాధించగా బాలికలు 22814 పరీక్షలు రాయగా 19237 ఉత్తీర్ణత సాధించారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా నెంబర్వన్ స్థానంలో నిలవడంతో సంతోషంగా ఉందని ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధికారి కిషన్ తెలిపారు.
ఇంటర్లో వీణకు 707.. వాణికి 712
70% పైగా మార్కులు సాధించిన అవిభక్త కవలలు
ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో అవిభక్త కవలలు వీణా వాణీలు ఉత్తీర్ణులయ్యారు. మంగళవారం విడుదలైన ఇంటర్ ఫలితాల్లో వీణా వాణీలు బీ గ్రేడ్లో పాసయ్యారు. అవిభక్త కవలలిద్దరూ మొదటి సంవత్సరంలో సాధించిన మార్కుల కంటే రెండో సంవత్సరంలో ఎక్కువ మార్కులు పొందారు. సీఈసీ గ్రూపులో వాణీకు మొత్తం మార్కులు 712 రాగా, వీణకు మొత్తం 707 మార్కులు వచ్చాయి. వీణా వాణీలను రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అభినందించారు.
వీరిద్దరి చక్కటి భవిష్యత్తుకు అవసరమైన సహకారాన్ని ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. వెంగళరావునగర్ డివిజన్లోని స్టేట్ హోం ఆవరణలోని బాల సదనానికి వెళ్లి అక్కడ ఆశ్రయం పొందుతున్న వీణావాణీలకు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ స్వయంగా స్వీట్లు తినిపించి సంతోషాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో వెంగళరావునగర్ కార్పొరేటర్ దేదీప్య విజయ్, బాల సదనం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
రంగారెడ్డి జిల్లాలో..
సెకండియర్కు 65,868 మంది
హాజరు కాగా, 42,170 మంది ఉత్తీర్ణులు
ద్వితీయ సం॥ 75 శాతం,
ప్రథమ సం॥ 72 శాతం ఉత్తీర్ణత
బాలురు – 5,868 మంది హాజరు కాగా, 42,170 మంది ఉత్తీర్ణులు
బాలికలు – 32,201 మంది హాజరు కాగా, 23,897 మంది ఉత్తీర్ణులు
బాలికలు – 74.21 శాతం ఉతీర్ణత,
బాలురు – 54.27 శాతం ఉతీర్ణత
ఫస్టియర్కు 77,369 మంది హాజరు కాగా, 47,485 మంది ఉత్తీర్ణులు
మేడ్చల్ జిల్లాలో…
రాష్ట్రంలో నెంబర్వన్ స్థానంలో
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా
ద్వితీయ సం॥ పరీక్షలు రాసిన వారు 48,821 – ఉత్తీర్ణులు 38,450
బాలురు 26,007 పరీక్షలు రాయగా 19,213 మంది ఉత్తీర్ణులు
బాలికలు 22,814 పరీక్షలు రాయగా 19,237 మంది ఉత్తీర్ణులు
సెకండియర్లో 78 శాతం ఉత్తీర్ణత
ఫస్టియర్లో 52,867 మంది పరీక్షలు రాయగా 40,703 ఉత్తీర్ణులు
ఫస్టియర్లో 76 శాతం ఉత్తీర్ణత..
పరీక్షలకు హాజరైన వారు: 65,868 – ఉత్తీర్ణులు: 42,170
సెకండియర్లో 33,667 మంది బాలురు పరీక్షలు రాయగా,
32,201 మంది ఉత్తీర్ణులు
హైదరాబాద్ జిల్లాలో సెకండియర్లో 64.02 శాతం ఉత్తీర్ణత
ఫస్టియర్లో 77,369 మంది పరీక్షలు రాయగా, 47,485 మంది ఉత్తీర్ణులు
ఫస్టియర్లో 61.37 శాతం ఉత్తీర్ణత