బండ్లగూడ,జూన్ 26: నిరుపేదలకు వైద్యం అందించి వారి ఆరోగ్య పరిరక్షణకు ఆర్ఆర్ ఫౌండేషన్ వారు కృషి చేయడం అభినందనీయమని ఏసీపీ గంగాధర్ తెలిపారు. ఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫౌండేషన్ చైర్మన్ ఎంపీ రంజిత్ రెడ్డి ఆదేశాల మేరకు యశోద దవాఖాన వారి సహకారంతో బుద్వేల్ జిల్లా పరిషత్ పాఠశాలలో నిరు పేదలకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏసీపీ గంగాధర్, రాజేంద్రనగర్ ఇన్స్పెక్టర్ నాగేంద్రబాబు హాజరై వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. సుమారు 300 మంది వరకు ప్రజలు పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా ఏసీపీ గంగాధర్ మాట్లాడుతూ..నిరు పేదలను ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆర్ఆర్ ఫౌండేషన్ ప్రతినిధులు, వైద్య సిబ్బంది, నాయకులు రాపోలు సత్తయ్య, దేవేందర్, దేవదాస్, నరేందర్ ,రాజుగౌడ్, ఆఫిస్ గౌతం, శ్రావణ్కుమార్ పాల్గొన్నారు.