జూబ్లీహిల్స్,జూన్24: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలతో మహిళల కండ్లల్లో సంతోషాన్ని.. వారి ఇండ్లలో కల్యాణకాంతులను నింపిన సీఎం కేసీఆర్ను పేదలు దేవుడిలా కొలుస్తున్నారని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళల ఆర్థిక స్వావలంబనకు అనేక పథకాలు ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని అన్నారు. శుక్రవారం యూసుఫ్గూడ డివిజన్లో కార్పొరేటర్ రాజ్కుమార్ పటేల్తో కలిసి 26 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైసా ఖర్చులేకుండా తెలంగాణ ప్రభుత్వం ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందజేస్తుందని తెలిపారు. మహిళల సాధికారతకు విశేషంగా కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ అసలైన మహిళా బంధుగా నిలిచారని.. మహిళలను విశేషంగా గౌరవించే ప్రభుత్వం లబ్ధిదారుల ఇంటికి వెళ్లి చెక్కులు అందజేయడం గర్వకారణమన్నారు. ఈ సందర్భంగా రూ.26 లక్షల విలువైన చెక్కులను అందజేశారు.వీఆర్వోలు విజయ్, స్వామి, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు సంతోష్ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి నర్సింగ్దాస్, నాయకులు ఖైసర్ జహాన్, గీతాగౌడ్, ఆదిలక్ష్మి, వేణుగోపాల్, నవీన్, చిన్న యాదవ్, శ్రీను, స్రవంతి, అరుణ పాల్గొన్నారు.