హయత్నగర్, జూన్ 23 : మన్సురాబాద్ డివిజన్ పరిధిలోని శ్రీబాలాజీనగర్ కాలనీలో 4 వేల గజాల స్థలంలో పార్కు అభివృద్ధికి నిధులు మంజూరయ్యాయని ఎంఆర్డీసీ చైర్మన్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. గురువారం మన్సురాబాద్ డివిజన్లోని శ్రీబాలాజీనగర్ కాలనీలో ఏర్పాటు చేసిన శ్రీపోచమ్మ దేవాలయ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై అమ్మవారికి పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాలనీకి రూ.32 లక్షలతో బీటీ రోడ్డు, రూ.20 లక్షలతో డ్రైనేజీ పనులకు టెండర్లు పూర్తయ్యాయని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. లెవల్స్ కలువని ప్రాంతంలో ప్రత్యేకంగా డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని, వరదనీటి సమస్యను కూడా తొలగిస్తామని వెల్లడించారు. కాలనీవాసులు దేవాలయాన్ని నిర్మించుకోవడం అభినందనీయమని, ఆలయ నిర్మాణ దాత శివప్రసాద్, విగ్రహ ధాత ఎం. ప్రభాకర్లను అభినందించారు. కార్పొరేటర్ కొప్పు ల నర్సింహారెడ్డి కూడా హాజరై అమ్మవారికి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్రెడ్డి, కాలనీ అధ్యక్షుడు గోగుల మోహన్రెడ్డి, ప్రధాన కార్యదర్శి అయితగోని శ్రీనివాస్, కాలనీ పెద్దలు జి. కొండారెడ్డి, ఎం. ప్రభాకర్, పరిశురాంరెడ్డి, మధుసూదన్రెడ్డి, శ్రావణ్, సురేశ్, నాయకులు అనంతుల రాజిరెడ్డి, జక్కిడి రఘువీర్రెడ్డి, పోచబోయిన జగదీశ్యాదవ్, చెన్నగోని శ్రీధర్గౌడ్, కటికరెడ్డి అర్వింద్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.