దుండిగల్,జూన్ 23:ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలోఅభివృద్ధి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ,మేడ్చల్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శంభీపూర్ రాజు అన్నారు.నిజాంపేట్ కార్పొరేషన్ పరిధి బాచుపల్లి జడ్పీహెచ్ఎస్ పాఠశాల ఉపాధ్యాయులు గురువారం శంభీపూర్లోని కార్యాలయంలో ఎమ్మెల్సీని కలిశారు.
పాఠశాలలో విద్యార్థుల సంఖ్యకు సరిపడా ఉపాధ్యాయులు లేరని,మౌలిక వసతులను మెరుగు పరచాలని ఎమ్మెల్సీ దృష్టికి తీసుకొచ్చారు.దీనికి స్పందించిన ఎమ్మెల్సీ జిల్లా విద్యాశాఖ అధికారులతో మాట్లాడి పాఠశాల అభివృద్ధికి ప్రత్యేక చొరవ తీసుకుంటానని,విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు తన వంతు సహాయం ఉంటుందన్నారు.అదనపు తరగతి గదులను నిర్మిస్తామన్నారు.నిజాంపేట్ మున్సిపల్ టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ పాండు,కార్పొరేటర్ సుధాకర్, పాఠశాల ప్రిన్సిపాల్ బసప్ప,ఉపాధ్యాయులు, చంద్రమోహన్, నర్సింహారెడ్డి, నాయకులు సత్తిరెడ్డి,నర్సింహా,చంద్రసేన తదితరులు ఉన్నారు.
ఆలయానికి విరాళం…
దుండిగల్ మున్సిపాలిటీ పరిధి,బౌరంపేట ఇందిరమ్మ కాలనీలోని శ్రీ ఎల్లమ్మ ఆలయంలో ఏర్పాటు చేయనున్న ధ్వజస్తంభానికి తన వంతు సహాయంగా ఎమ్మెల్సీ శంభీపూర్రాజు గురువారం విరాళం అందించారు.శంభీపూర్లోని తన కార్యాలయంలో ఆలయ కమిటీ సభ్యులకు చెక్కును అందజేసి ఆలయ అభివృద్ధిలో తన పూర్తి సహాయసహకారాలు ఉంటాయని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మేడ్చల్ మార్కెట్ కమిటీ చైర్మన్ రవీందర్యాదవ్,కౌన్సిలర్లు నర్సారెడ్డి శ్రీనివాస్రెడ్డి,శంకర్నాయక్, టీఆర్ఎస్ నాయకులు బుచ్చిరెడ్డి,మురళీయాదవ్,విష్ణువర్ధన్, గోవిందరెడ్డి,ఆలయ కమిటీ సభ్యులు లక్ష్మణ్, పిచ్చేశ్వర్, పవన్, గోపాల్ తదితరులు ఉన్నారు.