బంజారాహిల్స్,జూన్ 23: దళితబంధు పథకం కింద బోరబండ డివిజన్కు చెందిన శివజ్యోతి, విజయకృష్ణ దంపతులకు మంజూరైన కారును గురువారం ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దళిత బంధు పథకం దళితుల కుటుంబాల్లో వెలుగులు నింపుతుందని తెలిపారు. ఎన్నో ఏండ్లుగా కారు డ్రైవర్గా ఉన్న తనను ఓనర్గా చేయడంతో పాటు స్వయం ఉపాధి సాధించేలా చేసిన సీఎం కేసీఆర్కు, ఎమ్మెల్యే మాగంటికి లబ్ధిదారుడు విజయకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. టీఆర్ఎస్ నాయకులు విజయ్కుమార్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
కల్యాణలక్ష్మి చెక్కులు అందజేత..
వెంగళరావునగర్, జూన్ 23 : ఆడపిల్ల అదృష్టమని.. పెళ్లిచేసి అత్తవారింటికి పంపే బాధ్యతను నిర్వర్తించడంలో అన్నయ్యలా సీఎం కేసీఆర్ కానుకలు అందజేస్తున్నారని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తెలిపారు. గురువారం సోమాజిగూడ డివిజన్ ఎల్లారెడ్డిగూడలో నలుగురు లబ్ధిదారులకు రూ.4 లక్షల విలువ గల కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద, మధ్యతరగతి వారిని దృష్టిలో పెట్టుకుని సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. సోమాజిగూడ కార్పొరేటర్ వనం సంగీత శ్రీనివాస్ యాదవ్, డివిజన్ అధ్యక్షుడు అప్పూఖాన్, తన్నూఖాన్, మధుయాదవ్, మారుతి, శివ, వెంకటేశ్వర్లు, సరిత, ఐశ్వర్య పాల్గొన్నారు.
ఆలయాలతో ్ర పశాంతత..
వెంగళరావునగర్, జూన్ 23 : ఆలయాలతో ఆధ్యాత్మిక చింతన పెంపొందుతుందని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. గురువారం శ్రీనగర్కాలనీ డివిజన్ శ్రీ ధనలక్ష్మి ఆలయం (సోనాబాయి దేవాలయం)లో నిర్వహించని శ్రీ ధనలక్ష్మి ఆలయ జీవ ధ్వజ యంత్ర శిఖర యంత్ర పునశ్చరణ సహిత మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమానికి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆలయాలకు వచ్చినప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుందని పేర్కొన్నారు. దైవ సేవ చేసే భక్తులు పరోపకారులై కూడా ఉంటారని..సేవమార్గంలో పయనిస్తుంటారని అన్నారు. దాత సురేశ్, ఆలయ ఈవో విట్టలాయశర్మ, ఆలయ చైర్మన్ శరత్గౌడ్, ఆలయ సభ్యు లు భార్గవి, కవిత, రవి, చిన్నబాబు, సురేశ్, బాలకృష్ణ, డివిజన్ అధ్యక్షుడు అప్పుఖాన్, మధుయాదవ్, నర్సింగ్, నాగమణి, రాణి, శివ, మారుతి తదితరులు పాల్గొన్నారు.