మేడ్చల్ కలెక్టరేట్, జూన్ 22 : తెలంగాణను అన్ని రంగాలలో అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్దే రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. నాగారం మున్సిపాలిటీ పరిధిలోని 9, 12, 15, 17, 3వ వార్డులలో రూ. 75 లక్షల 30 వేలతో చేపట్టిన సీసీ రోడ్డు పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ.. గుంతల రోడ్లు లేకుండా గ్రామాలలో, పట్టణాలలో సీసీ, బీటీ రోడ్లను నిర్మిస్తున్నారని అన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా పట్టణ ప్రగతి, పల్లే ప్రగతిని నిర్వహించి పల్లెలు, పట్టణాలను శుభ్రంగా తీర్చిదిద్దుకున్నామని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తరువాత మన ముఖ్యమంత్రి పట్టణాలు, గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని అన్నారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా మార్కెట్లను, వైకుంఠదామాలను, పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించారని, హరితహారంతో గ్రామాలు, పట్టణాలు పచ్చటితోరణాలుగా దర్శనం ఇస్తున్నాయని తెలిపారు.
ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేశారని అన్నారు. కల్యాణలక్ష్మి, షాదిమూబరక్, పింఛన్లు, రైతు బందు, రైతు బీమా, దళిత బందు పథకాలతో పేద ప్రజలలో అనందం కనిపిస్తుందని పేర్కొన్నారు. 14వ వార్డులో నిర్మించిన మున్నూర కాపు సంఘం భవానాన్ని మంత్రి ప్రాంభించారు. 20వ వార్డులో నూతనంగా నిర్మించిన నల్లపోచమ్మ ఆలయంలో మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ నిర్వాహకులను మంత్రి ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు. పలు వార్డులలో మంత్రి మొక్కలను నాటి నీరు పోశారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి, కమిషనర్ ఎ.వాణిరెడ్డి, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ వెంకటేశ్, మున్సిపల్ వైస్ చైర్మన్ మలేశ్, కౌన్సిలర్లు, కో-అప్షన్ సభ్యులు, అధికారులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.