సిటీబ్యూరో, జూన్ 21 (నమస్తే తెలంగాణ) : వానకాలంలో సివరేజీ ఓవర్ ఫ్లో, రోడ్లపై వర్షపు నీరు నిలవడం లాంటి సమస్యలను వెంటనే పరిషరించడంతో పాటు ప్రజల భద్రత కోసం జలమండలి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇందు కోసం మాన్సూన్ సేఫ్టీ టీమ్లు, వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ వాహనాలను మంగళవారం ఖైరతాబాద్లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో ఎండీ దానకిశోర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జలమండలి ఎండీ దానకిశోర్ మాట్లాడారు. వానకాలంలో నిరంతరం అందుబాటులో ఉండేలా మొత్తం 16 మాన్ సూన్ సేఫ్టీ టీమ్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఒకో టీమ్లో ఐదుగురు సభ్యులు ఉంటారని, ఈ టీమ్లకు ప్రత్యేక వాహనాలు 24 గంటలు అందుబాటులో ఉంటాయని ఎండీ చెప్పారు. వర్షాకాలంలో ఎకడైనా నీరు నిలిస్తే వెంటనే అక్కడికి వెళ్లి ఆ నీటిని తొలగించేందుకు గానూ ఈ వాహనాల్లో జనరేటర్తో కూడిన డీ వాటర్ మోటర్ ఉంటుందని పేర్కొన్నారు. వర్షపు నీరు నిలిచి ప్రజలకు ఇబ్బంది కలిగితే ఈ బృందాలు వెంటనే ఆటంకాలను తొలగించి నీరు వెళ్లిపోయేలా చర్యలు తీసుకుంటాయని పేరొన్నారు. ఇందుకు సంబంధించిన పార, గడ్డపార, రక్షణ తాళ్లు తదితర పరికరాలు ఈ వాహనాల్లో అందుబాటులో ఉంచామని చెప్పారు. జీహెచ్ఎంసీ గుర్తించిన మొత్తం 211 నీరు నిలిచే ప్రాంతాలపైన ఈ బృందాలు ప్రత్యేక దృష్టి సారిస్తాయని వివరించారు.
సమాచారం లేకుండా మ్యాన్హోల్ తెరిస్తే క్రిమినల్ కేసులు
ముందస్తు ప్రణాళికలో భాగంగా లోతైన మ్యాన్ హోల్లకు సేఫ్టీ గ్రిల్స్ ఏర్పాటు చేసినట్లు ఎండీ చెప్పారు. మ్యాన్ హోల్ మూత తెరవడం జలమండలి యాక్ట్లోని సెక్షన్ 74 ప్రకారం నేరమని, ఎవరైనా మ్యాన్ హోల్ మూతలు తెరిస్తే క్రిమినల్ కేసులు నమోదవుతాయని పేర్కొన్నారు. అత్యవసరమైతే జలమండలి కస్టమర్ కేర్ నంబరు 155313కు ఫోన్ చేయాలని సూచించారు. ప్రజలు చేయకూడని పనులతో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించడానికి కాలనీలు, బస్తీల్లో పలు కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈఎన్సీ, ఆపరేషన్స్ డైరెక్టర్ – 1 అజ్మీరా కృష్ణా, ఆపరేషన్స్ డైరెక్టర్ – 2 స్వామి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
కలుషిత నీటి సమస్యలు,సివరేజీ ఓవర్ ఫ్లోపై ఫోకస్
మాన్ సూన్ సేఫ్టీ టీమ్ వాహనాలతో పాటు మరో 16 మినీ ఎయిర్ టెక్ వాహనాలు కూడా అందుబాటులో ఉండేలా చూస్తున్నట్లు ఎండీ దానకిశోర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన జలమండలి అధికారులకు పలు సూచనలు చేశారు. ముంపునకు గురయ్యే ప్రాంతాల్లో మ్యాన్ హోళ్ల దగ్గర హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేయాలని ఆదేశించారు. కలుషిత నీటి సమస్యలు, మ్యాన్ హోల్ ఓవర్ ఫ్లో పై వచ్చే ఫిర్యాదులను జీఎంలు ఎప్పటికప్పుడు పరిషరించడానికి ప్రాధాన్యతనివ్వాలని సూచించారు.