రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్
రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో కోట్లాది రూపాయల నిధులతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ అన్నారు. మంగళవారం ఆయన అత్తాపూర్ డివిజన్ పరిధిలోని హైదరగూడలో రూ.33 లక్షల నిధులతో డ్రైనేజీ, సీసీ రోడ్డు పనులకు శంపస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బస్తీలు, కాలనీల్లో కనీస సౌకర్యాలు, మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నటు ్లతెలిపారు. అత్తాపూర్ డివిజన్లో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఎప్పడికప్పుడు తెలుసుకొని అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. అత్తాపూర్, హైదర్గూడ ప్రభుత్వ పాఠశా ల నుంచి హైదర్గూడ చౌరస్తా వరకు రూ.17.35లక్షలతో సీసీ రోడ్డును, రూ.16.80లక్షలతో డ్రైనేజీ పైప్లైన్ పనులకు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు.
ప్రజల సమస్యలు పరిష్కారమే లక్ష్యంగా పని చేస్తున్నామని, ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బస్తీల్లో మరిన్ని ప్రాంతాల్లో డ్రైనేజీ పనులు ఉండటంతో వెంటనే ఎస్టిమేషన్లు వేయాలని అధికారులకు సూచించారు. అనంతరం చింతకుంట పార్కును సందర్శించిన ఎమ్మెల్యే అక్కడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పార్కులో జరుగుతున్న పనులపై స్థానికులు ఫిర్యాదు చేయడంతో త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఆయన ఈఈని ఆదేశించారు. అనంతరం హైదరగూడ మూసీ శ్మశానవాటికను ప్రహరీ నిర్మించాలని గ్రామస్తులు కోరడంతో త్వరలోనే పనులు జరిగేలా చూస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సంగీత, రంగారెడ్డి జిల్లా టీఆర్ఎస్ నాయకులు మిద్దెల సురేందర్రెడ్డి, అమరేందర్ నాయకులు చిన్నా, నరేందర్, కొమరయ్య, మల్లారెడ్డి, రామేశ్వర్రావు, వినయ్కుమార్, గౌరీశంకర్, పీఎంరెడ్డి, సదానంద్, మహేశ్, శ్రీధర్రెడ్డి, సుధాకర్, రమేశ్, పుల్లారెడ్డి, సిద్ధెశ్వర్, వెంటేశ్, జగన్, మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.