జూబ్లీహిల్స్, జనవరి 31: కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో చేపడుతున్న ఫీవర్ సర్వే ముమ్మరంగా సాగుతుంది. ఆరోగ్య కార్యకర్తలతో కలిసి జీహెచ్ఎంసీ సిబ్బంది జలుబు, జ్వరం లక్షణాలున్న వారిని గుర్తించేందుకు ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. దగ్గు, జ్వరం ఉన్నవారికి అక్కడే హోం ఐసొలేషన్ కిట్లు అందజేస్తున్నారు. యూసుఫ్గూడ, రహ్మత్నగర్, బోరబండ, వెంగళరావునగర్, ఎర్రగడ్డ డివిజన్లలో ప్రతి ఇంటికీ వెళ్లి వివరాలను నమోదు చేస్తున్నారు. పీహెచ్సీ, జీహెచ్ఎంసీ అధికారుల ఆధ్వ ర్యంలో ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు, జీహెచ్ఎంసీ ప్రత్యేక బృందాలు ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరిస్తున్నాయి. సోమవారం 3003 మందిని పరిశీలించి, జ్వర లక్షణాలున్న 139 మందికి ఫీవర్ కిట్లను పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు. యూసుఫ్గూడ సర్కిల్లో డీఎంసీ రమేశ్ ఆధ్వర్యంలో ఏఎంఓహెచ్ డాక్టర్ బిందుభార్గవి, ఎస్పీహెచ్ఓ డాక్టర్ అనూరాధ ఫీవర్ సర్వేను పరిశీలించారు.