అతిపెద్ద వినాయకుడిగా, ప్రతి ఏటా విశేష పూజలందుకునే ఖైరతాబాద్ గణేశుడి విగ్రహాన్ని ఈ ఏడాది మట్టితో, సహజ రంగులతో తయారు చేస్తున్నట్లు నిర్ణయించడంపై శనివారం ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ సమితి ప్రతినిధులను బల్దియా కమిషనర్ లోకేశ్కుమార్, నగర సీపీ ఆనంద్ సన్మానించారు. ప్రజల్లో స్ఫూర్తి నింపేలా 50 అడుగుల భారీ మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. -సిటీబ్యూరో, జూన్ 11 (నమస్తే తెలంగాణ)