ముషీరాబాద్, జూన్ 4: నగరాన్ని అభివృద్ధి దిశగా నడిపించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ పిలుపునిచ్చారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు ముషీరాబాద్ డివిజన్ పార్శిగుట్ట, అడిక్మెట్ డివిజన్ సత్యానగర్ కమ్యూనిటీహాల్, ఎస్ఆర్టీ క్వార్వర్స్లో నిర్వహించిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొని పారిశుధ్య పనులు ప్రారంభించారు. జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బందితో కలిసి ఫుట్పాత్లపై మట్టికుప్పలు, చెత్త తొలగింపు పనులు చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పరిసరాల పరిశుభ్రంగాతో పాటు ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో ప్రభుత్వం పట్టణ ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు.
నియోజకవర్గంలోని పలు బస్తీలు, కాలనీల్లో పేరుకుపోయిన చెత్త, మట్టికుప్పలు, నిర్మాణ వ్యర్థాల తొలగింపు పనులు చేపట్టి, వర్షాకాలంలో పారిశుధ్య సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. శ్మశాన వాటికలు మొదలు కొని ప్రధాన రోడ్ల వరకు పారిశుధ్య పనులు చేపట్టి స్వచ్ఛత దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో యూసీడీ ప్రాజెక్టు ఆఫీసర్ రత్నారాణి, టీఆర్ఎస్ పార్టీ నాయకులు సురేందర్, మచ్చుకుర్తి ప్రభాకర్, అనురాధ, సత్యానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు యాదగిరి, ప్రతినిధులు రాజేందర్, ప్రసాద్, బాజ్జీ, ముషీరాబాద్ డివిజన్ టీఆర్ఎస్ నాయకులు టి.సోమసుందర్, శ్రీధర్రెడ్డి, ఆకుల అరుణ్, దిన్దయాల్రెడ్డి, శివముదిరాజ్, శ్రీకాంత్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.
డ్రైనేజీ సమస్యలు తలెత్తకుండా చర్యలు
పద్మశాలీ కాలనీలో డ్రైనేజీ సమస్యలు తలెత్తకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ పేర్కొన్నారు. శనివారం భోలక్పూర్ డివిజన్లోని పద్మశాలీ కాలనీలో రూ.16.5లక్షలతో డ్రైనేజీ నిర్మాణ పనులను స్థానిక కార్పొరేటర్ గౌసొద్దీన్ తహ, జలమండలి డీజీఎం చంద్రశేఖర్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డివిజన్లో తాగునీటి, డ్రైనేజీ సమస్యలు తలెత్తకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఇప్పటి వరకు భోలక్పూర్లో రూ.25కోట్లతో తాగునీటి, డ్రైనేజీ నూతన పైపులైన్ నిర్మాణ పనులను చేపట్టినట్లు తెలిపారు. అదేవిధంగా పైపులైన్ నిర్మాణ పనులు పూర్తయిన చోట సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ భోలక్పూర్ డివిజన్ అధ్యక్షుడు వై.శ్రీనివాస్ రావు, నాయకులు బింగి నవీన్ కుమార్, ముచ్చకుర్తి ప్రభాకర్, ఉమాకాంత్ ముదిరాజ్, కృష్ణమూర్తి, ఆర్.శ్రీనివాస్, మల్లేశ్, కల్యాణ్, ప్రవీణ్, భీమేశ్, ఎంఐఎం నాయకుడు హాజీ పాషా తదితరులు పాల్గొన్నారు.