ఉప్పల్, మే 27 : దళితుల అభ్యున్నతికి దళితబంధు దోహదపడుతుందని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. నాచారానికి చెందిన శ్రీరామ్ సత్యనారాయణకు దళితబంధు ద్వారా మహేంద్ర బులేరో వాహనం పొందడంతో జీవనోపాధికి అవకాశం లభించడంతో శుక్రవారం ఎమ్మెల్యేను కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపి, శాలువాతో సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దళితుల కుటుంబాలకు అండగా నిలుస్తూ, వారికి రూ.పదిలక్షలు అందజేసి, ఉపాధికి మార్గం చూపడంతో ఎంతోమందికి మేలు జరుగుతుందని అన్నారు. దళితబంధు లబ్ధిదారుల కుటుంబాలు సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పన్నాల దేవేందర్రెడ్డి, నేతలు జనుంపల్లి వెంకటేశ్వర్రెడ్డి, మేకల ముత్యంరెడ్డి, కాటేపల్లి రవీందర్రెడ్డి, పల్లా కిరణ్కుమార్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సీఎం రిలీఫ్ ఫండ్ పథకం పేదలకు వరం..
మల్లాపూర్, మే 27 : సీఎం రిలీఫ్ ఫండ్ పథకం ద్వారా నిరు పేదలకు ఎంతో మేలు జరుగుతున్నదని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. మల్లాపూర్ డివిజన్కు చెందిన పలువురు లబ్ధి దారులు రాంజాంబీకి రూ.60 వేలు, భాగ్యకు రూ.38వేలు, మల్లికార్జున్కు రూ.60 వేలు, భిక్షపతికి రూ.9,500, సత్తయ్యకు రూ.52 వేలు, ఉదయ శంకర్కు రూ.31 వేలు, పోచమ్మకు రూ.55 వేలు, మల్లేశ్కు రూ. 16 వేలు, మధనకు రూ. 42 వేలు, నరేందర్కు రూ. 55 వేలు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన చెక్కులను శుక్రవారం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సుభాష్రెడ్డి కార్పొరేటర్ పన్నాల దేవేందర్రెడ్డితో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అత్యవసర ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఆపన్న హస్తంగా సీఎం రిలీఫ్ ఫండ్ పథకం ఎంతో ఉపయోగ పడుతుందన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు జనుంపల్లి వెంకటేశ్వర్రెడ్డి, మల్లాపూర్, నాచారం టీఆర్ఎస్ అధ్యక్షులు కిరణ్కుమార్రెడ్డి, ముత్యంరెడ్డి, రవీందర్రెడ్డి, శంకర్, శ్రావణ్రెడ్డి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.