ఉస్మానియా యూనివర్సిటీ, మే 23: మన దేశ మూలవాసు లు, ఆదివాసీల సంస్కృతిని నేటి తరానికి చాటి చెప్పాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నా రు. డాక్టర్ పంతుకల శ్రీనివాస్ రచించిన ‘ట్రెడిషనల్ ఫోక్ మీడియా ఇన్ ఇండియా’ అనే పుస్తకాన్ని ఇంగ్లిష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ)లోని కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అల్లం నారాయణ హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మీడియా విస్తృతమైన ఈ కాలంలో ఇటువంటి పుస్తకాన్ని రాయడం అభినందనీయమన్నారు. ఆదివాసీల పండుగలు, వాటి ఉపయోగాలను వివరించేందుకు ఈ పుస్తకం ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పా రు.
నాగోబా, కేస్లాపూర్ జాతరలు ఆదివాసీల జీవితాలలో భాగమయ్యాయని, వాటి గురించి ఈ పుస్తకంలో చక్కగా వివరించారన్నారు. ఇఫ్లూలో అనేక రా ష్ర్టాలు, దేశాల నుంచి విద్యార్థులు ఉన్నత చదువు అ భ్యసిస్తుంటారని గుర్తు చేశారు. అటువంటి వర్సిటీలో పుస్తకాన్ని ఆవిష్కరించడం గర్వంగా ఉందన్నారు. పుస్తక రచయిత పంతుకల శ్రీనివాస్ మాట్లాడుతూ, భారతదేశ సంప్రదాయాలలో జానపద కళలు, వాటి ఆవశ్యకతను తెలిపేలా పుస్తకాన్ని రచించినట్లు వివరించారు. ఆదివాసీలు నిర్వహించుకునే పాత పంటల జాతరలో సంప్రదాయ ఔషధాలు ఎన్నో లభిస్తాయని చెప్పారు. కరోనా వంటి కొత్త వ్యాధులకు కూడా అక్క డ ప్రకృతి సిద్ధమైన ఔషధాలు దొరుకుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్లు మనోజ, నాగమల్లిక, విద్యార్థి నాయకుడు దర్శన్ పాల్గొన్నారు.