సికింద్రాబాద్, మే 23: నిరు పేదలకు ఖరీదైన వైద్య ఖర్చులకు సీఎంఆర్ఎఫ్( ముఖ్యమంత్రి సహాయ నిధి) అండగా నిలుస్తుందని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అన్నారు. సోమవారం కార్ఖానాలోని తన క్యాంపు కార్యాలయంలో నాలుగో వార్డు పికెట్ నెహ్రూనగర్లోని రామ్నగర్కు చెందిన మదన్సింగ్ వైద్యం కోసం రూ.3లక్షల విలువ చేసే ఎల్వోసీని ఎమ్మెల్యే సాయన్న అందజేశారు. కొంతకాలంగా అనారోగ్యంతో మదన్సింగ్ నిమ్స్ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. దీంతో వైద్య ఖర్చుల నిమిత్తం ఎమ్మెల్యే సాయన్నను సంప్రదించగా సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేయించారు. అనంతరం సీఎంఆర్ఎఫ్ నుంచి మంజూరైన రూ.3లక్షల విలువ గల ఎల్వోసీని లబ్ధిదారుడికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణలో సబ్బండ వర్ణాల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ ఎన్నో రకాల సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారని కొనియడారు. ఆపదలో ఉన్న పేదలకు సీఎంఆర్ఎఫ్ మరింత భరోసాగా నిలిచిందన్నారు. పేదలకు కార్పొరేట్స్థాయి లో మెరుగైన వైద్యాన్ని అందించడానికి సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో బోయిన్పల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్, నేతలు నివేదిత, ముప్పిడి మధుకర్, సదానంద్గౌడ్, సంతోష్, మురళీయాదవ్, నిత్యానంద్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.