హిమాయత్నగర్,మే 23: వేసవి సెలవుల్లో విహార యాత్రలకు, ఊరికి వెళ్లేవారు పోలీస్ స్టేషన్లో సమాచారం ఇచ్చి వెళ్లితే ఇంటి వద్ద ప్రత్యేక నిఘా పెట్టేందుకు నారాయణగూడ పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఈ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆయా ప్రాం తాల్లో పెట్రోలింగ్ను సమర్థవంతంగా నిర్వహిస్తూ నిఘాను పటిష్టం చేస్తున్నారు. దొంగలు తాళం వేసి ఉన్న ఇళ్లను మాత్రమే ఎంచుకుని దొంగతనాలకు పాల్పడే అవకాశ ముందని,వారి పట్ల అప్రమత్తంగా ఉంటూ విధిగా జాగ్రత్తలు పాటిం చాలని పోలీసులు సూచిస్తున్నారు.
విహార యాత్రలకు,ఊరికి వెళ్లేటప్పుడు పలు జాగ్రత్తలు పాటిస్తే దొంగల భారీన పడకుండా విలువైన వస్తు వులు, నగలు, నగదును రక్షించుకోవచ్చని సూచిస్తున్నారు.యాత్రలు, ఊరేళ్లే ముందు పక్కింటి వారితో పాటు స్థానిక పోలీసులకు సమాచారం ఇస్తే ఆయా ప్రాంతాల్లో రాత్రిపూట గస్తీ పెంచి దొంగతనాలు జరుగకుండా చూడటానికి ఆస్కారం ఉంటుందన్నారు. హాక్ఐ, ఫేస్బుక్, వాట్సాప్ను ప్రజలు పూర్తిగా సద్వినియోగం చేసుకుని నేరాలను అదుపు చేయడానికి పోలీసులకు సహకరించాలని కోరుతున్నారు.అత్యవసర సమయంలో 100 లేదా 94906-16314 నంబర్కు సమాచారం అందించాలని సూచిస్తున్నారు.
సమాచారం ఇస్తే గస్తీ పెంచుతాం..
బస్తీలు, కాలనీలు అపార్ట్మెంటులో నివాసం ఉండే విహార యాత్రలకు, ఊరికి వెళ్లే సమయంలో సమాచారం ఇస్తే గస్తీ పెంచుతాం.అపార్ట్మెంట్లకు సెక్యూరిటీగా ఉన్న వారు అప్రమత్తంగా ఉండాలి. రాత్రి సమయాల్లో అపార్టుమెంటులోకి వచ్చే అనుమానిత వ్యక్తులపై అనుమానం వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి. ప్రతి ఇంటికి సీసీ కెమెరా ఉంటే ఈ సందర్భంలో ఎంతో ఉపయోగంగా ఉంటుంది. యాత్రలు, ఊర్లకు వెళ్లిన తరువాత పక్కింటివారికి ఫోన్ చేసి వివరాలు తెలుసుకుంటూ ఉండాలి.
– బి.గట్టుమల్లు, నారాయణగూడ పీఎస్ ఇన్స్పెక్టర్